యాప్నగరం

జాదవ్ కోసం సుదర్శన్ సైకత శిల్పం

సుదర్శన్ పట్నాయక్... కుల్ భూషణ్ జాదవ్ కు న్యాయం జరగాలని కోరుతూ ఇసుక శిల్పాన్ని నిర్మించారు.

TNN 16 May 2017, 8:04 am
మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కు పాకిస్థాన్ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ తీర్పుపై భారత్ అంతర్జాతీయ న్యాయసంస్థను (ఐసీజే) ఆశ్రయించింది. భారత్ వాదనను విన్న అంతర్జాతీయ న్యాయస్థానం పాక్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. దీనిపై సోమవారం పాక్, భారత్ లు అంతర్జాతీయ న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించాయి. 18 ఏళ్ల తరువాత దాయాది దేశాలు ఇలా నేరుగా ఐసీజేలో తలపడ్డాయి. ఈ సందర్భంగా ప్రపంచం మెచ్చిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్... కుల్ భూషణ్ జాదవ్ కు న్యాయం జరగాలని కోరుతూ ఇసుక శిల్పాన్ని నిర్మించారు. ఒడిశాలోని పూరీ బీచ్ లో కుల్ భూషణ్ ముఖ చిత్రంతో పాటూ ‘జస్టిస్ ఫర్ కుల్ భూషణ్ జాదవ్’ అని క్యాప్షన్ పెట్టారు. ఆ సైకత శిల్పాన్ని చూసేందుకు బీచ్ లు పర్యాటకులు వస్తున్నారు. సుదర్శన్ పట్నాయక్ దేశ ఎదుర్కొనే సమస్యలను, సంచలనం అవుతున్న అంశాలను ఎన్నుకుని బీచ్ లో ఇసుక శిల్పాల్ని నిర్మిస్తారు.
Samayam Telugu sand artist sudarsan pattnaik seeks justice for kulbhushan jadhav
జాదవ్ కోసం సుదర్శన్ సైకత శిల్పం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.