యాప్నగరం

శివలింగంపై పాదాలు.. వివాదంలో స్వామిజీ!

పరమశివుణ్ణి భక్త వశంకరుడుగా పిలుస్తాం. శివనామ స్మరణ చేస్తే చాలు ఆ సదాశివుడు మనకి కొండంత అండగా ఉంటాడని నమ్ముతారు భక్తులు.

TNN 10 Nov 2017, 4:27 pm
పరమశివుణ్ణి భక్త వశంకరుడుగా పిలుస్తాం. శివనామ స్మరణ చేస్తే చాలు ఆ సదాశివుడు మనకి కొండంత అండగా ఉంటాడని నమ్ముతారు భక్తులు. శివలింగానికి అభిషేకాలు చేసి తరిస్తుంటారు. పవిత్ర కార్తీకమాసంలో శివనామస్మరణ చేస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అందుకే శివ భక్తులు కార్తీక మాసంలో శైవక్షేత్రాలకు.. అలాగే వైష్ణవాలయాలకు వెళ్లి భక్తి శ్రధ్దలతో ప్రత్యేక పూజలు చేస్తారు. శివాలయంలో లింగాలకు అభిషేకాలు చేయిస్తారు. శివుణ్ణి ఇంతగా భక్తి శ్రద్ధలతో పూజించే భక్తులకు ఓ స్వామీజీ నిర్వాకరం ఆగ్రహం తెప్పిస్తోంది.
Samayam Telugu shanthi lingeshwara swamy ji worship lord shiva with his foot
శివలింగంపై పాదాలు.. వివాదంలో స్వామిజీ!


భక్తుల విశ్వాసాలపై నీళ్లు చల్లుతూ ఓ స్వామీజీ సాక్షాత్తు శివలింగపైనే రెండు కాళ్లు మోపి పూజలు చేయించుకున్నారు. అదేమంటే వీరశైవ విధానమని తన శిష్యబృందంతో సెలవిప్పించారు. శివభక్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్న ఈ ఘటన బెంగళూరు శివారులోని రంగనబెట్టలో ఈనెల 5న చోటుచేసుకుంది. శాంతి లింగేశ్వర మఠానికి రంగనబెట్టలో మరో శాఖను ప్రారంభించిన సందర్భంగా అక్కడ శివలింగానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా మఠానికి చెందిన స్వామీజీ ఒకరు శివలింగంపై కాళ్లు పెట్టి పూజ చేయించుకున్నారు. ఇదికాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో శివభక్తులు షాకయ్యారు.

ఎంతటి స్వామీజీ అయినా తాను దైవం కన్నా ఎక్కువ అని భావించరాదని భక్తులు మండిపడుతున్నారు. స్వామీజీ చెప్పినట్లుగా ఏ విధానంలోనూ ఈ తరహాలో పూజలు నిర్వహించలేదని తేల్చి చెబుతున్నారు. అయితే వీరశైవులకు, శివ భక్తులకు చాలా తేడా ఉందని శాంతి లింగేశ్వర అనుచరులు చెబుతున్నారు. వీరశైవులు శివలింగపై కాళ్లు పెట్టి పూజలు చేస్తారంటున్నారు. గతంలోనూ 100కు పైగా శివలింగాలకు ఈ విధంగానే ప్రాణ ప్రతిష్ఠ చేశారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.