యాప్నగరం

డబ్బుల్లేక ఇల్లమ్ముకుంటున్న పీటర్ ముఖర్జీ

లాయర్ ఖర్చులకి డబ్బులు లేకపోవడంతో ముంబైలోని ఇంటిని అమ్మేయాలనుకుంటున్నాడు పీటర్.

TNN 12 Mar 2016, 12:10 pm
పీటర్ ముఖర్జీ... ఒకప్పుడు మీడియా దిగ్గజం. స్టార్ ఇండియా సీఈవో... తరచూ బ్రిస్టల్ (యూకే), మార్బెల్లా (స్పెయిన్), మార్లో (ముంబయిలోని ఇల్లు) లకు తిరుగుతూనే ఉండేవారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కటకటాల వెనుక ఉన్నారు. షీనా బోరా హత్యకేసులో అతను కూడా ఒక నిందితుడు. ఆధారాలని నాశనం చేశాడన్న ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అతను తన తరుఫున చాలా ఖరీదైన క్రిమినల్ లాయర్ ని పెట్టుకున్నాడు. ఆ లాయర్ ఒకసారి కోర్టులో వాదించడానికే మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేస్తాడు. ఇప్పటికే 1.5 కోట్లు ఖర్చయ్యాయి. ఇప్పుడు పీటర్ దగ్గర డబ్బుల్లేవు. లాయర్ ఖర్చులు కోసం ముంబైలోని వర్లిలో ఉన్న మార్లో అపార్ట్ మెంట్లోని డ్యూప్లెక్ష్ ఇంటిని అమ్మేయాలనుకుంటున్నాడు. దాని ఖరీదు 15 నుంచి 20 కోట్లు ఉంటుంది.
Samayam Telugu sheena bora murder case peter mukerjea looking to sell house for legal battle
డబ్బుల్లేక ఇల్లమ్ముకుంటున్న పీటర్ ముఖర్జీ


ఆస్తి కోసం కన్నకూతురినే చంపిన ఇంద్రాణి... తన భర్త పీటర్ ముఖర్జీ ఖాతాలో కూడా డబ్బులు ఉంచలేదు. మొత్తం ఆర్థిక వ్యవహారాలన్నీ తనచేతుల్లోనే పెట్టుకుంది. ఇంద్రాణి పేరు మీద అయిదు బ్యాంకు అకౌంట్లు ఉంటే... పీటర్ పేరుపై ఒకే ఒక్కటి ఉంది. ఇప్పుడు అది కూడా ఖాళీ అయ్యింది. దీంతో కష్టకాలంలో పీటర్ కు డబ్బుల్లేని పరిస్థితి. కాగా వర్లిలో ఉన్న అపార్ట్‌మెంట్‌ను పీటర్ విధికి కానుకగా ఇచ్చాడు. విధి ఇంద్రాణి, సంజీవ్ ఖన్నాకు పుట్టిన కూతురు. ఆమెను తన కూతురిగానే చూసూకునేవాడు పీటర్. విధి ఆ ఫ్లాట్ ను తన అన్న పీటర్ మొదటి భార్య కొడుకు రాబిన్ ముఖర్జీకి బహుమతిగా ఇచ్చేసింది. విధి లండన్లో ఉంటుండడంతో ఆ ఇంట్లో ఇప్పుడు పీటర్ చెల్లెలు, రాబిన్ ఉంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.