కీలెరిగి వాతపెట్టాలని మన పెద్దలు ఏ ముహూర్తాన చెప్పారో కానీ, దేశంలో ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో రోగాలకు వాతల వైద్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. వైద్య సదుపాయాలు అంతగా లేని రోజుల్లో అంటే గత్యంతరం లేని స్థితిలో నాటువైద్యాన్ని ఆశ్రయించేవారు. కానీ, ప్రస్తుతం రోజులు మారాయి. అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ వైద్యం ఎండమావిగానే ఉందనేందుకు ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఒడిశాలోని గిరిజన ప్రాబల్య జిల్లా అయిన కోరాపుట్లొ పుట్టి నెల రోజులు కూడా కాని పసికందుకు అనారోగ్యం చేసింది. దాంతో శిశువు తల్లితండ్రులు స్థానికంగా ఉన్న నాటు వైద్యుడిని ఆశ్రయించారు. సదరు నాటువైద్యుడు ఒక ఇనుప మేకును నిప్పుల్లో ఎర్రగా కాల్చి పాపం ఆ శిశువు సుతిమెత్తని పొట్ట నిండా వాతలు పెట్టాడు. ఆ వాతల దాటికి ఆ పసికందు అల్లాడిపోయింది. అనారోగ్యం తగ్గకపోగా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది.
వాతపెడితే రోగం పోతుందిట
దేశంలో ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో రోగాలకు వాతల వైద్యం ఇంకా కొనసాగుతూనే ఉంది
TNN 7 Sep 2016, 9:26 pm