యాప్నగరం

పులులకు గాడిదను ‘బలి’చ్చిన సిబ్బంది

ఆకలితో ఉన్న పులులకు బతికున్న గాడిదను జూ అధికారులు, సిబ్బందే ‘బలి’చ్చిన అమానవీయ సంఘటన ఇది.

Samayam Telugu 7 Jun 2017, 3:44 pm
ఆకలితో ఉన్న పులులకు బతికున్న గాడిదను జూ అధికారులు, సిబ్బందే ‘బలి’చ్చిన అమానవీయ సంఘటన ఇది. ఆకలితో అలమటిస్తున్న పులులున్న ఎన్ క్లోజర్ లోకి బంధించిన పట్టుకొచ్చిన గాడిదను వాటికి ఆహారంగా వేశారు. ఈ సంఘటన చైనాలోని ఎన్ చెంగ్- చాంగ్ చౌ జూపార్కులో జూన్ 5న చోటు చేసుకుంది.
Samayam Telugu shocking video live donkey fed to tigers in china zoo
పులులకు గాడిదను ‘బలి’చ్చిన సిబ్బంది


ఈ జూపార్క్ నుంచి ఎలాంటి ఆదాయం రావడం లేదన్న కారణంగా ఇక్కడి సిబ్బందే జంతువులను ఒక్కొక్కటిగా ‘బలి’స్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. జూకు చెందిన కొంతమంది ఓ ట్రక్కులో బంధించిన తెచ్చిన గాడిదను పులులు ఉంటున్న ఎన్ క్లోజర్ లోకి విసిరేయడం.... గాడిదను చూడగానే..పులులు తమ పంజా పవర్ తో మీద చంపి తినేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.


గాడిదను పులులకు బలిచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. జూ సిబ్బందిపై విమర్శలు వచ్చాయి. దీంతో గాడిదను పులులకు ఎరగా వేయడం తప్పేవేనని, ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూస్తామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.