యాప్నగరం

కోట్లు ఖర్చుచేసి తన ఉద్యోగులకు న్యూఇయర్ పార్టీ ఇచ్చాడు!

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల కోసం కోట్లు ఖర్చుచేసి న్యూఇయర్ పార్టీని ఇచ్చి వార్తలో నిలిచాడు ఓ సీఈఓ.

TNN 2 Jan 2018, 3:22 pm
ఓ సీఈఓ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి న్యూఇయర్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీ కోసం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ సంస్థకు చెందిన 5000 మంది ఉద్యోగులను లాస్ ఏంజెల్స్‌కు రప్పించాడు. మల్టీమీడియా యాప్ స్నాప్‌చాట్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఇవాన్ స్పైగల్ తన ఉద్యోగుల కోసం కొత్త ఏడాది వేడుకలకు ఏకంగా 4 మిలియన్ డాలర్లు అంటే రూ.26 కోట్లు ఖర్చుచేసి వార్తల్లో నిలిచారు. ఈ పార్టీకి లాస్‌ఏంజెల్స్‌లోని మైక్రోసాఫ్ట్ థియేటర్‌ను అద్దెకు తీసుకుని, వివిధ దేశాల్లోని తమ సంస్థ ఉద్యోగులను అమెరికాకు తీసుకొచ్చారు. పార్టీలో నోరూరించే వివిధ రకాల ఆహార పదార్థాలతోపాటు వినోద కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. ప్రముఖ అమెరికన్‌ పాప్‌స్టార్‌ డ్రేక్‌తో కచేరీ కూడా నిర్వహించారు.
Samayam Telugu snapchats ceo threw employees a massive new years party worth rs 26 crore
కోట్లు ఖర్చుచేసి తన ఉద్యోగులకు న్యూఇయర్ పార్టీ ఇచ్చాడు!


ఈ పార్టీకి అయిన ఖర్చు మొత్తం ఇవాన్ స్పైగల్ భరించారు. 27 ఏళ్ల ఈ యువ బిలీనియర్ వార్షిక ఆదాయం 3.5 బిలియన్‌ డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.22వేల కోట్లు. ఇన్‌స్ట్రాగ్రామ్ నుంచి స్నాప్‌చాట్ తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. గతేడాది భారతీయులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఇవాన్‌ వార్తల్లో నిలిచారు. దీంతో భారతీయుల ఆగ్రహానికి గురయ్యారు. మరికొందరు స్నాప్‌చాట్‌ యాప్‌ను సైతం డిలీట్‌ చేశారు. వారిలో బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.