యాప్నగరం

బాలిక మిస్సింగ్ కేసులో సోషల్ మీడియా కీలక పాత్ర!

మూడేళ్ల బాలిక మిస్సింగ్ కేసును సోషల్ మీడియా సహకారంతో కేవలం పదిహేను గంటల్లో పోలీసులు ఛేదించారు.

TNN 2 Feb 2017, 12:44 pm
మూడేళ్ల బాలిక మిస్సింగ్ కేసును సోషల్ మీడియా సహకారంతో కేవలం పదిహేను గంటల్లో పోలీసులు ఛేదించారు. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని నంద్‌నగరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తప్పిపోయిన మూడేళ్ల చిన్నారి ఆశ్రమంలో ఉన్నట్లు సోషల్ మీడియా సహకారంతో పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో స్నేహితులతో ఆడుకోడానికి బయటకు వెళ్లిన తమ కుమార్తె కనిపించడం లేదంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Samayam Telugu social media helps trace 3 year old missing girl in delhi
బాలిక మిస్సింగ్ కేసులో సోషల్ మీడియా కీలక పాత్ర!


ఆడుకోడానికి బయటకు వెళ్లిన బాలిక కనిపించకపోవడంతో ఆమె నాయినమ్మ తమ చుట్టుపక్కల ఇళ్లల్లో వెదికింది. కుటుంబ సభ్యులు కూడా ఆమె ఫోటోలు పట్టుకుని స్థానికులను ఆరా తీశారు. అయితే ఎక్కడ ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బాలిక నాయినమ్మ వివరణ ఆధారంగా కిడ్నాప్ కేసు నమోదు చేసి వెంటనే విచారణ చేపట్టామని ఈశాన్య ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజిత్ సింగ్లా తెలిపారు.

ఆమె ఫోటోలను వాట్సాప్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పంపి ఆచూకి కోసం ప్రయత్నించామని అన్నారు. అలాగే బాలికను వెదకడం కోసం నంద్‌నగరి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వీర్ సింగ్ నాయకత్వంలో పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందం సమీపంలో బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్, హోటల్స్‌లో గాలించిందని ఆయన తెలిపారు.

ఆమె పోస్టర్లను కూడా ఆటో స్టాండ్, బస్టాండ్, ఈ-రిక్షా స్టాండుల్లో అతికించామని పేర్కొన్నారు. పదిహేను గంటల ఆపరేషన్ తర్వాత ఆ బాలిక ఆశ్రమంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో బాలిక ఫోటోలను చూసిన వాళ్లు తమకు సమాచారం అందిచారని డీసీపీ తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.