రేప్ కేసులు..మగవాళ్లపై కోర్టు జాలి!
అత్యాచారానికి గురైన బాధితురాలపై అందరి జాలీ ఉంటుంది. సానుభూతి వ్యక్తం అవుతూ ఉంటుంది. అలాంటి బాధితుల పట్ల సమాజం స్పందిస్తుంది.
TNN 31 Oct 2017, 2:43 pm
అత్యాచారానికి గురైన బాధితురాలపై అందరి జాలీ ఉంటుంది. సానుభూతి వ్యక్తం అవుతూ ఉంటుంది. అలాంటి బాధితుల పట్ల సమాజం స్పందిస్తుంది. అదంతా మంచిదే. అత్యాచార బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం, బాధ్యత అందరి మీదా ఉంటుంది. అయితే అన్ని అత్యాచారాలూ నిజం కాకపోవచ్చు. అంటే.. ఒక్కోసారి తప్పుడు కేసులు కూడా నమోదు కావొచ్చు! అలాంటి సందర్భాల్లో మగవాళ్ల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించింది ఢిల్లీ హై కోర్టు. తమ వద్ద విచారణకు వచ్చిన ఒక కేసు విషయంలో న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో నిందితుడు నిర్దోషిగా రుజువు కావడంతో.. కోర్టు ఆసక్తి దాయకమైన వ్యాఖ్యాలు చేసింది.
ఈ కేసులో నిందితుడు నిర్దోషి అని తేలడానికి పట్టిన సమయం అక్షరాలా 20 సంవత్సరాలు! రెండు దశాబ్దాలుగా రేపిస్టు అనే.. నిందను భరించాడు అతడు. అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు అని పోలీసులు నిరూపించలేకపోయారు. ఇలాంటి కేసుల్లో నిందితుల పరిస్థితి ఏమిటి? అని కోర్టు ప్రశ్నించింది. నిజంగానే నేరం చేయకపోయినా.. మానసిక క్షోభను అనుభవించి, జీవితాంతం చెరగని ముద్రను వేసుకునే వాళ్ల తరఫున గళం విప్పాలని హక్కుల సంఘాలకు, మహిళా సంఘాలకు కోర్టు సూచించింది. అవసరం అయితే అలాంటి నిర్దోషులకు పరిహారం ఇప్పించడం కూడా సబబే అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు చేసింది ఒక మహిళా న్యాయమూర్తి కావడం గమనార్హం.
1997, సెప్టెంబర్ 18న తనపై ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని, ఇంట్లోనే అతడు ఘాతుకానికి పాల్పడ్డాడు అని ఒక మైనర్ బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు, కేసులు పెట్టారు. ఈ కేసు విచారణ ఇరవై సంవత్సరాల పాటు సాగింది. తాజాగా తీర్పును ఇచ్చింది న్యాయస్థానం. ఆమెపై అత్యాచారం జరిగలేదని వైద్యుల నివేదికలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ ఈ కేసు చిక్కులు తప్పించుకుని బయటకు రావడానికి అతడికి ఇరవై సంవత్సరాలు పట్టింది. ఈ నేపథ్యంలో నిందితుడిపై న్యాయంస్థానం సానుభూతి వ్యక్తం చేసింది. ఇలాంటి సందర్భాల్లో మగవాళ్లకు కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
ఈ కేసులో నిందితుడు నిర్దోషి అని తేలడానికి పట్టిన సమయం అక్షరాలా 20 సంవత్సరాలు! రెండు దశాబ్దాలుగా రేపిస్టు అనే.. నిందను భరించాడు అతడు. అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు అని పోలీసులు నిరూపించలేకపోయారు. ఇలాంటి కేసుల్లో నిందితుల పరిస్థితి ఏమిటి? అని కోర్టు ప్రశ్నించింది. నిజంగానే నేరం చేయకపోయినా.. మానసిక క్షోభను అనుభవించి, జీవితాంతం చెరగని ముద్రను వేసుకునే వాళ్ల తరఫున గళం విప్పాలని హక్కుల సంఘాలకు, మహిళా సంఘాలకు కోర్టు సూచించింది. అవసరం అయితే అలాంటి నిర్దోషులకు పరిహారం ఇప్పించడం కూడా సబబే అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు చేసింది ఒక మహిళా న్యాయమూర్తి కావడం గమనార్హం.
1997, సెప్టెంబర్ 18న తనపై ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని, ఇంట్లోనే అతడు ఘాతుకానికి పాల్పడ్డాడు అని ఒక మైనర్ బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు, కేసులు పెట్టారు. ఈ కేసు విచారణ ఇరవై సంవత్సరాల పాటు సాగింది. తాజాగా తీర్పును ఇచ్చింది న్యాయస్థానం. ఆమెపై అత్యాచారం జరిగలేదని వైద్యుల నివేదికలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ ఈ కేసు చిక్కులు తప్పించుకుని బయటకు రావడానికి అతడికి ఇరవై సంవత్సరాలు పట్టింది. ఈ నేపథ్యంలో నిందితుడిపై న్యాయంస్థానం సానుభూతి వ్యక్తం చేసింది. ఇలాంటి సందర్భాల్లో మగవాళ్లకు కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.