యాప్నగరం

బ్యాడ్ మదర్: తనయుడి తల నరికిన తల్లి

నవమాసాలు కనిపెంచిన అమ్మే ఉన్మాదిలా మారింది. కన్నకొడుకును కత్తికి బలిచ్చింది

Samayam Telugu 21 Oct 2016, 10:51 am
నవమాసాలు కనిపెంచిన అమ్మే ఉన్మాదిలా మారింది. కన్నకొడుకును కత్తికి బలిచ్చింది. శవాన్ని ఇంట్లో దాచి రోజుకో అవయావాన్ని నరికింది. చదవుతుంటే, సంఘటన తాలుకూ వింటుంటేనే ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్న ఈ భయంకరమైన మర్డర్ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
Samayam Telugu son beheaded body cut into pieces by mother
బ్యాడ్ మదర్: తనయుడి తల నరికిన తల్లి


పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం,.కాకుమాను మండలం బోడిపాలేంకు చెందిన అంజనాదేవి (60)కి కుమారుడు కోటేశ్వరరావు (40)తోపాటు ఇద్దరు కుమార్తెలున్నారు. భర్త ఆరేళ్లకిందట అంజనాదేవిని వదిలివెళ్లాడు. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. అంజనాదేవి కొడుకు కోటేశ్వరరావు కోడలు దగ్గరే ఉంటుంది. అయితే గతకొంతకాలంగా కోటేశ్వర్ రావు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. భర్త వ్యాధితో ఉన్నాడని భార్య శైలజ కూడా కొన్నిరోజులు తనను విడిచివెళ్లిపోయింది. పెద్దల సమక్షంలో రాజీ కుదర్చడంతో కోటేశ్వర్ రావుతో కలిసి ఉంటోంది.

తన వ్యాధి నివారణ కోసం కోటేశ్వరరావు పేరు మీదున్న 1.67ఎకరాల భూమి అమ్మేసి వైద్యం చేయించుకుంటున్నాడు.

తనకు వ్యాధి పూర్తిగా నయం కావాలంటే మరింత డబ్బు అవసరమైంది. దీంతో తల్లి పేరుమీదున్న 3.23 ఎకరాల పొలం అమ్మాలని కోటేశ్వరరావు తల్లి అంజనాదేవీపై ఒత్తిడి పెంచాడు. పొలాన్ని అమ్మడానికి అంగీకరించకపోవడంతో తల్లికొడుకుల మధ్య వాగ్వాదం మొదలైంది.

కొడుకు పొలం అమ్మాలని ఒత్తిడి చేస్తున్నాడని అంజనాదేవి బోడిపాలేంలోనే ఉన్న తమ్ముడు నాగేశ్వరరావు, ఇతరగ్రామాల్లో ఉన్న కూతుళ్లకు సమాచారమిచ్చింది. ఈ మధ్యలోనే దసరా పండుగ ఉండటంతో భార్య శైలజ తల్లిగారింటికి వెళ్లిపోయింది.

ఇదే అదనుగా భావించిన అంజనాదేవీ, తమ్ముడు నాగేశ్వరరావు, కూతురు నాగలక్ష్మిలు కలిసి ఈనెల 13న రాత్రి కోటేశ్వరరావుపై దాడి చేసి చంపేశారు .

శవాన్ని ఇంట్లోనే దాచిపెట్టారు. పండగ తర్వాత ఇంటికి వచ్చిన కోటేశ్వరరావు భార్య శైలజకు....నీభర్త గుంటూరు వెళ్లాడని, వారం పదిరోజుల దాకా రాడంటూ నమ్మబలికింది. ఇంట్లో దుర్వాసన ఏంటనీ శైలజ అడిగితే....పందికొక్కులు చనిపోయాయని చెప్పింది. ఆమెను తిరిగి తన తల్లిగారింటికి వెళ్లిపోయేలా ఒత్తిడి చేసింది అంజనాదేవి.

ఆతరువాత శవాన్ని బయటక తీస్కెళ్తే ఎవరైనా గుర్తిస్తారని, అంజనాదేవీ తన కొడుకు శవాన్ని రోజు ముక్కలు ముక్కలు నరకడం మొదలుపెట్టింది. తల మొండెం వేరు చేసింది. చేతులు నరికింది. శరీరంలోని కొన్ని అవయవాలు గట్టిగా ఉండటంతో..అంజనాదేవీ గట్టిగా నరకడం మొదలుపెట్టింది. ఆ శబ్దానికి ఇరుగుపొరుగు వారు గమనించి చూడటంతో అసలు విషయం బయటపడింది.

పోలీసులకు సమాచారమివ్వడంతో అంజనాదేవిని అరెస్టు చేశారు. ఆమె సోదరుడు, కూతురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.