యాప్నగరం

కొడుకు మరణాన్ని తట్టుకోలేక దంపతులు..

అర్థాంతరంగా తనువు చాలించిన కొడుకులేని లోకంలో తాము కూడా జీవించలేమని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో చోటు చేసుకుంది.

TNN 8 Jan 2017, 12:59 pm
అర్థాంతరంగా తనువు చాలించిన కొడుకులేని లోకంలో తాము కూడా జీవించలేమని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హృద‌య‌ విదారకమైన ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. తమ ఒక్కగానొక్క బిడ్డ మృతి చెందడంతో పట్టాభిపురానికి చెందిన చంద్రశేఖర్, నవీన దంపతులు తమ నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో విగతజీవులుగా వేలాడుతున్న వీరిని గుర్తించిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు.
Samayam Telugu son death after parents suicide in pattabhipuram in guntur
కొడుకు మరణాన్ని తట్టుకోలేక దంపతులు..


గుంటూరు పట్టణం ఇన్నర్ రింగ్‌రోడ్‌లోని ఓ కార్పొరేట్ పాఠశాలలో చంద్రశేఖర్ దంపతుల కుమారుడు వంశీ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గతేడాది డిసెంబరు 22 న వంశీ జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు. జ్వరంతో బాధపడుతున్న వంశీని ఉపాధ్యాయులు సకాలంలో ఇంటి పంపకపోవడంతోనే మరణించాడని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు.

ఈ అంశంలో పాఠశాల ప్రిన్సిపాల్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీ ఆకస్మిక మృతితో చంద్రశేఖర్‌, నవీన కొద్దిరోజులుగా తీవ్ర మనోవేదనతో గడుపుతున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున తనువు చాలించాలని నిర్ణయించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి మృతితో పట్టాభిపురంలోని రవీంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆ కుటుంబం బుగ్గిపాలు కావడానికి కారణమైన పాఠశాల యాజమాన్యంపై కఠినచర్యలు తీసుకోవాలని బంధువులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.