యాప్నగరం

కొడుకు పరీక్షలో తప్పాడని తల్లి ఆత్మహత్య!

పరీక్షలో ఫెయిలవడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడే విద్యార్థుల ఉదంతాలు తరచూ చూస్తూనే ఉంటాం. కానీ..

TNN 2 Jun 2017, 7:45 pm
పరీక్షలో ఫెయిలవడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడే విద్యార్థుల ఉదంతాలు తరచూ చూస్తూనే ఉంటాం. కానీ, తన కుమారుడు పదో తరగతి పరీక్షల్లో తప్పడం వల్ల అతడి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. బెంగళూరు నగరానికి చెందిన మహాదేవి (40) ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. ఆ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఆమె కుమారుడు ఫెయిల్ అయ్యాడు. గణితం సబ్జెక్టు సరిగా ఒంటబట్టించుకోని ఆ విద్యార్థి అందులో సఫలీకృతం కాలేకపోయాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. టీచర్‌గా పని చేస్తున్న మహాదేవి.. తన కొడుకే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది.
Samayam Telugu son failed in 10th mother commits suicide
కొడుకు పరీక్షలో తప్పాడని తల్లి ఆత్మహత్య!


కుమారుడు ఫెయిల్ అయిన విషయంలో మహాదేవికి ఆమె భర్త బసవరాజుతో వాగ్వాదం జరిగింది. కొడుకు చదువును నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలా జరిగిందని బసవరాజు బుధవారం (మే 31) తన భార్యను దూషించాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. అతడు ఆఫీసు నుంచి తిరిగొచ్చే సరికి ఆమె విగతజీవిగా మారింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read this in Kannada

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.