యాప్నగరం

ఎమ్మెల్యే కూతురిపై ప్రేమోన్మాది దాడి

బీజేపీ ఎమ్మెల్యే కూతురిపై ఓ ప్రేమోన్మాది విచక్షణరహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.

TNN 4 Apr 2017, 3:02 pm
బీజేపీ ఎమ్మెల్యే కూతురిపై ఓ ప్రేమోన్మాది విచక్షణరహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె తనతో మాట్లాడడానికి ఇష్టపడక పోవడంతో విచక్షణను కోల్పోయి ఇలా చేసినట్టు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రాలోని పుణెలోని ఓ కాలేజీలో అశ్వినీ బోడుకుర్వార్ (22) ఎంబీయే చదువుతోంది. ఆమె తండ్రి సంజీవ్ రెడ్డి బోడుకుర్వార్ బీజేపీ ఎమ్మెల్యే. అశ్వినీ క్లాసులోనే హర్యానాకు చెందిన రాజేష్ బక్షి (23) కూడా చదువుతున్నాడు. గత ఆరునెలలుగా వీరికి పరిచయం ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం నుంచి రాజేష్ అశ్విని వెంటపడడం ప్రారంభించాడు. ఆమెను రోడ్డు మధ్యలో ఆపి మాట్లాడడానికి ప్రయత్నించేవాడు. రాజేష్ మాట్లాడడానికి అశ్విని నిరాకరించేది. అతని వేధింపులు మరీ ఎక్కువ అవ్వడంతో ఆమె కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. యాజమాన్యం రాజేష్ పిలిపించుకుని తీవ్రంగా మందలించింది. ఇంకెప్పుడు అశ్విని వెంటపడనని, మాట్లాడనని రాతపూర్వకంగా రాయించుకుంది.
Samayam Telugu stalker attacks mlas daughter in pune cuts finger
ఎమ్మెల్యే కూతురిపై ప్రేమోన్మాది దాడి


అలా రాసిన మరుసటి రోజు రాజేష్ కాలేజీకి వచ్చాడు. ఉదయం 8గంటల ప్రాంతంలో అశ్విని కూడా కాలేజీకి వచ్చింది. స్నేహితురాలితో కలిసి కళాశాల పక్కనుంచే ఏటీఎంకి వెళ్లింది. అక్కడికి వెళ్లిన రాజేష్ అశ్వినితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఆమె అతడితో మాట్లాడడానికి ఇష్టపడలేదు. వెంటనే రాజేష్ తనతో తెచ్చుకున్న చాకుతో ఆమెపై దాడి చేశాడు. దారుణంగా ఆమె ముఖంపైనా, చేతులపైనా గాయాలు చేశాడు. ఆమె అడ్డుకోవడానికి పయత్నిస్తుండగా చిటికెన వేలు తెగిపడిపోయింది. మూడు వేళ్లు కోసుకుపోయాయి. ఈలోపు ఇద్దరు విద్యార్థులు వచ్చి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కత్తి లాక్కుని పడేసి, బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈలోపు పోలీసులకు సమాచారం అందించి రాజేష్ వారికి అప్పగించారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే దంపతులు కూతురును చూసేందుకు ఆసుపత్రికి వెళ్లారు. తమ బిడ్డ ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని వారు మీడియాకు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.