యాప్నగరం

స్టోర్ ముందే పతంజలి ఉద్యోగిని హత్య

పతంజలి స్టోర్‌లో పనిచేస్తున్న ఓ అమ్మాయి ఆ స్టోర్ ముందే దారుణ హత్యకు గురైంది.

TNN 29 Mar 2017, 12:49 pm
పతంజలి స్టోర్‌లో పనిచేస్తున్న ఓ అమ్మాయి ఆ స్టోర్ ముందే దారుణ హత్యకు గురైంది. స్టోర్ నుంచి రాత్రి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమెను ఎవరు చంపారో, ఎందుకు చంపారో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. అసలేం జరిగిందంటే. యూపీకి చెందిన గుంజన్ (18) తల్లిదండ్రులతో కలిసి గురుగ్రామ్ లో నివసిస్తోంది. సెక్టార్ 21లో ఉన్న పతంజలి స్టోర్ లో ఆమె సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూ... దూర విద్యలో డిగ్రీ చదువుతోంది. కాగా సోమవారం రాత్రి 9గంటలకు ఇంటికి వస్తుండగా ఆమెను ఎవరో చంపేశారు. అది కూడా స్టోర్ కు దగ్గర్లోనే. కాగా ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలలో రికార్డయిన దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. అందులో గుంజన్ వెనుక నల్ల షర్టులో ఒక వ్యక్తి వెంటపడుతూ కనిపించాడు. బైక్ పై వచ్చిన అతడు గుంజన్ పై రెండు సార్లు కాల్పులు జరిపి పారిపోయాడు. అయితే ఫుటేజీ స్పష్టంగా లేకపోవడంతో... అతనెవరో తెలుసుకోలేకపోయారు పోలీసులు.
Samayam Telugu stalker killed patanjali store executive say cops
స్టోర్ ముందే పతంజలి ఉద్యోగిని హత్య


గుంజన్ తండ్రి చంద్రభాన్ పవన్ అనే యువకుడే తన కూతురిని చంపినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుంజన్-పవన్ లకు మూడేళ్ల నుంచి పరిచయం ఉందని చెప్పాడు. పోలీసులు పవన్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారమే కారణమన్న కోణంలోనూ కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.