యాప్నగరం

కాబోయే భర్తను కొట్టి యువతిపై కిరాతకం

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఓ డిగ్రీ విద్యార్థినిని చెరబట్టి ఆరుగురు దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కాబోయే భర్త ఎదుటే ఈ కిరాతకానికి ఒడిగట్టారు. భాంజానగర్‌కు చెందిన డిగ్రీ యువతికి ఇటీవలే పెళ్లి కుదిరింది.

TNN 17 Oct 2017, 9:11 pm
ఓ వైపు ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతుండగానే.. ఒడిషాలో మరో కిరాతకం చోటు చేసుకుంది. గంజాం జిల్లాలో ఓ డిగ్రీ విద్యార్థినిని చెరబట్టి ఆరుగురు దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కాబోయే భర్త ఎదుటే ఈ కిరాతకానికి ఒడిగట్టారు. భాంజానగర్‌కు చెందిన డిగ్రీ యువతికి ఇటీవలే పెళ్లి కుదిరింది. కాబోయే భర్తతో కలిసి ఆమె సోమవారం (అక్టోబర్ 16) మధ్యాహ్నం గంగాపూర్‌ సమీపంలోని బుధకేందూ థాకూరాణి ఆలయానికి వెళ్లింది. తిరిగి వస్తుండగా.. రెండు బైక్‌లపై వచ్చిన ఆరుగురు దుండగులు వారి బైక్‌ను అడ్డగించారు. ఆమెతో పాటు ఉన్న యువకుణ్ని తీవ్రంగా కొట్టి, వారిద్దరి వద్ద నుంచి మొబైల్ ఫోన్లను లాక్కున్నారు. ఆ తర్వాత ఆమెను పక్కకు లాక్కెళ్లి ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Samayam Telugu student gang raped in presence of fiance 6 arrested in odisha
కాబోయే భర్తను కొట్టి యువతిపై కిరాతకం


రేప్ చేస్తున్న దృశ్యాలను ఆ దుండగులు తమ సెల్‌ ఫోన్లలో చిత్రీకరించారు. అనంతరం వారిద్దరినీ అలాగే వదిలేసి పారిపోయారు. దీనిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆశిష్‌ సింగ్‌ ఆదేశాలతో వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 24 గంటలు గడవక ముందే.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరినీ కోర్టులో ముందు హాజరుపరిచారు. బాధిత యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు.

కొరాపుట్‌ గ్యాంగ్‌రేప్‌ ఘటన మరవక ముందే.. రాష్ట్రంలో మరో కిరాతకం చోటు చేసుకోవడంతో ఒడిషా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం కిందట.. కొరాపుట్‌లో తొమ్మిదో తరగతి బాలిక గ్యాంగ్ రేప్‌కు గురైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న భద్రతా సిబ్బంది వేషధారణలో ఉన్న నలుగురు దుండగులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని సదరు బాలిక కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.