యాప్నగరం

కొత్త ఏడాది వేళ బెంగళూరు వాసుల విన్నూత్న ఆలోచన!

రోడ్లపై రద్దీని నియంత్రించడానికి, అందుబాటులో ఉన్న రైల్వే వ్యవస్థను వినియోగించుకునేలా కొంత మంది స్వచ్చందంగా సదస్సులు నిర్వహించి ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు.

TNN 30 Dec 2016, 4:09 pm
రోడ్లపై రద్దీని నియంత్రించడానికి, అందుబాటులో ఉన్న రైల్వే వ్యవస్థను వినియోగించుకునేలా కొంత మంది స్వచ్చందంగా సదస్సులు నిర్వహించి ప్రజల్లో అవగాహన కలిగించనున్నారు. చాలా మంది ఎక్కువ దూరాలకు మాత్రమే రైలు ప్రయాణాలను ఎంపిక చేసుకుంటారు. కేవలం దూర ప్రయాణాలకే కాదు, నగరంలోనూ వాటి ద్వారా ప్రయాణించి సమయాన్ని ఆదా చేసుకోవాలని బెంగళూరులోని కొంతమంది ఔత్సాహికులు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు.
Samayam Telugu subraban railway tracks human train to enter your homes
కొత్త ఏడాది వేళ బెంగళూరు వాసుల విన్నూత్న ఆలోచన!


బెంగళూరులోని 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న రైలు మార్గాలు, వివిధ ప్రాంతాల్లోని 40 రైల్వే స్టేషన్ల వినియోగించుకునేలా నగరంలోని పౌరులకు ప్రేరణ కలిగించనున్నారు. పరిసర ప్రాంతాల్లోని సబర్బన్ రైల్వేలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా చుకుబుకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

నగరంలో అతి పెద్ద రైల్వే వ్యవస్థ ఉన్నా, ప్రయాణానికి అవసరమైన వసతులు లేకపోవడంతో నిరుపయోగంగా ఉందని చుకుబుకులోని సభ్యురాలు తారా కృష్ణస్వామి అన్నారు. రైలు ప్రయాణాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించే అవకాశం ఉంటుందని పౌరులకు తేలియజేయనున్నట్లు ఆమె తెలిపారు.

అలాగే ప్రయాణానికి అనువైన వసతులు కల్పించాలని సంబంధిత శాఖకు లేఖలు, విన్నపాల ద్వారా వివరిస్తామని తారా తెలియజేశారు. చుకుబుకు ఉద్యమంలో కార్పొరేట్ వర్గాల నుంచి కూరగాయలమ్మే వాళ్లు కూడా సభ్యులుగా ఉన్నారని మరో సభ్యురాలు ప్రియా చెట్టీ రాజ్‌గోపాల్ తెలిపారు. నగరంలోని ఎక్కువ మంది ప్రజలను రైలు ప్రయాణాలకు ప్రోత్సహించడం ద్వారా ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడొచ్చని ఆమె అన్నారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.