యాప్నగరం

బాధ్యతను గుర్తుచేస్తున్న సైకత శిల్పం

సందర్భానికి అనుగుణంగా, సామాజిక సందేశంతో కూడిన సైకత శిల్పాలు నిర్మించడంలో సుదర్శన్ పట్నాయక్ సిద్ధహస్తులు.

TNN 17 Nov 2016, 7:21 pm
సందర్భానికి అనుగుణంగా, సామాజిక సందేశంతో కూడిన సైకత శిల్పాలు నిర్మించడంలో సుదర్శన్ పట్నాయక్ సిద్ధహస్తులు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న ‘పెద్ద నోట్ల రద్దు’ సమస్యపై తాజాగా ఆయన ఒడిశాలోని పూరీ తీరంలో ఒక సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ప్రజలు కొంచెం ఓపిగ్గా ఉండాలని, అవసరం మేరకే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలని సూచిస్తూ ‘డీమోనిటైజేషన్’ హ్యాష్ ట్యాగ్‌తో సైకత శిల్పాన్ని నిర్మించారు.
Samayam Telugu sudarsan pattnaik sand art on demonetisation in puri beach
బాధ్యతను గుర్తుచేస్తున్న సైకత శిల్పం


నిజానికి కేంద్ర పెద్ద నోట్లను రద్దు చేసినప్పటి నుంచి ఏటీఎం ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. ఎన్నిసార్లు లైన్‌లో నిలుచున్న కొంత మందికి డబ్బులు చిక్కడంలేదు. కానీ ఒకసారి డ్రా చేసుకున్నవారే మళ్లీ మళ్లీ క్యూలో నిల్చొని డబ్బులు డ్రా చేసుకుంటున్నట్లు ఆరరోపణలు వస్తున్నాయి. దీంతో చాలా మంది సామాన్యులు అసహనానికి గురవుతున్నారు. బహుశా దీన్ని చూసాకే సుదర్శన్‌కి ఈ సైకత శిల్పం నిర్మించాలనే ఆలోచన వచ్చిందేమో!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.