యాప్నగరం

శాంతిని బోధిస్తున్న ‘రంజాన్’ సైకత శిల్పం

దేశవ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సోమవారం ‘ఈద్ ఉల్ ఫితర్’ను పురష్కరించుకుని ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పాన్ని నిర్మించారు.

TNN 26 Jun 2017, 2:07 pm
దేశవ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సోమవారం ‘ఈద్ ఉల్ ఫితర్’ను పురష్కరించుకుని ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పాన్ని నిర్మించారు. పూరీ తీరంలో రూపొందించిన ఈ సైకత శిల్పం శాంతిని, సోదరభావాన్ని బోధిస్తోంది. ఈ సైకత శిల్పం ద్వారా ముస్లిం సోదరులకు పట్నాయక్ ‘ఈద్ ముబాకర్’ చెప్పారు. ‘శాంతి, సోదరభావంతో ప్రపంచ వ్యాప్తంగా పండుగను జరుపుకుంటున్న వారందరికీ ఈద్ ముబారక్’ అని ట్విట్టర్ ద్వారా పట్నాయక్ వెల్లడించారు. ఆయన రూపొందించిన సైకత శిల్నాన్ని కూడా ట్విటీలో పెట్టారు.
Samayam Telugu sudarsan pattnaik sand art on eid ul fitr
శాంతిని బోధిస్తున్న ‘రంజాన్’ సైకత శిల్పం

#EidMubarak to all celebrating the festival of 'Peace & Brotherhood' across the Globe. Greetings! My sand art at #Puri beach. pic.twitter.com/BYvYh9z5HG — Sudarsan Pattnaik (@sudarsansand) June 26, 2017
పండుగులు, ప్రత్యేకమైన రోజులను పురష్కరించుకుని సైకత శిల్పాలను నిర్మించడం సుదర్శన్ పట్నాయక్ ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా ఆయన మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికే ఆయన ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. ఆదివారం పూరీ జగన్నాథస్వామి రథయాత్రను పురష్కరించుకుని కూడా పట్నాయక్ అద్భుత సైకత శిల్పాన్ని నిర్మించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.