అన్న చెల్లెళ్ల, అక్క తమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీక పవిత్ర రక్షా బంధన్. జీవితాంతం అన్నదమ్ములు తమకు రక్షణగా నిలవాలని కోరుకుంటూ అక్కచెల్లెళ్లు రాఖీలు కడతారు. అలాగే సోదరులు తమ అక్కచెల్లెళ్లకు బహుమతులు అందజేస్తారు. అయితే ఈ రక్షా బంధన్కు మాత్రం సోదరీమణులే అన్నదమ్ములకు హెల్మెట్ను గిఫ్టుగా ఇవ్వాలని తెలంగాణ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఓ ప్రచారం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ‘సిస్టర్స్ ఫర్ ఛేంజ్’ అనే పేరుతో ‘మన సోదరుల భద్రత కోసం చేతులు కలుపుదాం’ అంటూ ప్రచారం చేశారు. దీనికి మంచి స్పందనతో పాటు ప్రశంసలు కూడా వచ్చాయి.
ఇప్పుడు కవిత పిలుపును ప్రేరణగా తీసుకొని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించారు. రక్షా బంధన్ సందర్భంగా నిర్మించిన ఈ సైకత శిల్పంపై ‘సోదరుల భద్రత కోసం చేతులు కలుపుదాం’ అని రాశారు. అలాగే కవిత సూచించిన #GiftAHelmet హ్యాష్ ట్యాగ్ను కూడా చెక్కారు. రాఖీ ఆకారాన్ని నిర్మించి దేశ ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
My SandArt with message Let's join hands for our brothers safety #GiftAHelmet .#Sisters4Change . Happy #RakshaBandhan pic.twitter.com/kmWcOp2eAn — Sudarsan Pattnaik (@sudarsansand) August 7, 2017
ఇప్పుడు కవిత పిలుపును ప్రేరణగా తీసుకొని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించారు. రక్షా బంధన్ సందర్భంగా నిర్మించిన ఈ సైకత శిల్పంపై ‘సోదరుల భద్రత కోసం చేతులు కలుపుదాం’ అని రాశారు. అలాగే కవిత సూచించిన #GiftAHelmet హ్యాష్ ట్యాగ్ను కూడా చెక్కారు. రాఖీ ఆకారాన్ని నిర్మించి దేశ ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
My SandArt with message Let's join hands for our brothers safety #GiftAHelmet .#Sisters4Change . Happy #RakshaBandhan pic.twitter.com/kmWcOp2eAn — Sudarsan Pattnaik (@sudarsansand) August 7, 2017