భారత మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత క్షిపణి శాస్త్రవేత్త, మహా మనిషి, భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మనకు దూరమై రెండు సంవత్సరాలు పూర్తయింది. 2015 జులై 27న మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని ఐఐఎం విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ గుండెపోటుతో కన్నుమూశారు. కలాం రెండో వర్థంతిని పురస్కరించుకుని ఒడిశాకు చెందిన ప్రముఖ సైత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ‘సైకత శ్రద్ధాంజలి’ ఘటించారు. పూరీ తీరంలో ‘ట్రిబ్యూట్ టు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం’ అంటూ అద్భుత సైకత శిల్పాన్ని నిర్మించారు.
కామన్ మ్యాన్, మిస్సైల్ మ్యాన్, భారత్ రత్న, స్టూడెంట్స్ ఐకాన్, పీపుల్స్ ప్రెసిడెంట్ అని ఐదు రకాలైన కలాం హావభావాలను ఆయన చెక్కారు. పట్నాయక్ సైకత శిల్పానికి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది.
My SandArt to Tribute to Dr. #APJAbdulKalam on his death anniv. A #CommonMan,#MissileMan, #BharatRatna, #PeoplesPresident, #StudentsIcon pic.twitter.com/9WBYiNNtEj — Sudarsan Pattnaik (@sudarsansand) July 27, 2017
కాగా, సామాన్యుడిగా పుట్టి అంతులేని శిఖరాలను అవలీలగా అందుకున్న అసామాన్యుడు ఏపీజే అబ్దుల్ కలాం. తమిళనాడులోని రామేశ్వరంలో అక్టోబర్ 15, 1931లో జన్మించిన ఆయన పూర్తి పేరు.. ఆవుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి తనకిష్టమైన భౌతికశాస్త్రం, ఏరోస్సేస్లో ఇంజినీరింగ్ పట్టా తీసుకున్న తర్వాత డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)లో చేరారు. డీఆర్డీవో హైదరాబాద్లోనూ పనిచేశారు. ప్రధానంగా రక్షణ, అంతరిక్ష పరిశోధనలపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత భారత క్షిపణి కార్యక్రమాల్లో విస్తృతంగా తన సేవలు అందించారు. పృథ్వి, అగ్ని, ఆకాశ్, నాగ్, త్రిశూల్ తదితర క్షిపణుల అభివృద్ధి విశేషమైన సేవలు అందించినందిన కలాంకు ‘మిస్సైల్ మ్యాన్’ అని పేరు వచ్చింది.
కామన్ మ్యాన్, మిస్సైల్ మ్యాన్, భారత్ రత్న, స్టూడెంట్స్ ఐకాన్, పీపుల్స్ ప్రెసిడెంట్ అని ఐదు రకాలైన కలాం హావభావాలను ఆయన చెక్కారు. పట్నాయక్ సైకత శిల్పానికి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది.
My SandArt to Tribute to Dr. #APJAbdulKalam on his death anniv. A #CommonMan,#MissileMan, #BharatRatna, #PeoplesPresident, #StudentsIcon pic.twitter.com/9WBYiNNtEj — Sudarsan Pattnaik (@sudarsansand) July 27, 2017
కాగా, సామాన్యుడిగా పుట్టి అంతులేని శిఖరాలను అవలీలగా అందుకున్న అసామాన్యుడు ఏపీజే అబ్దుల్ కలాం. తమిళనాడులోని రామేశ్వరంలో అక్టోబర్ 15, 1931లో జన్మించిన ఆయన పూర్తి పేరు.. ఆవుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి తనకిష్టమైన భౌతికశాస్త్రం, ఏరోస్సేస్లో ఇంజినీరింగ్ పట్టా తీసుకున్న తర్వాత డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)లో చేరారు. డీఆర్డీవో హైదరాబాద్లోనూ పనిచేశారు. ప్రధానంగా రక్షణ, అంతరిక్ష పరిశోధనలపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత భారత క్షిపణి కార్యక్రమాల్లో విస్తృతంగా తన సేవలు అందించారు. పృథ్వి, అగ్ని, ఆకాశ్, నాగ్, త్రిశూల్ తదితర క్షిపణుల అభివృద్ధి విశేషమైన సేవలు అందించినందిన కలాంకు ‘మిస్సైల్ మ్యాన్’ అని పేరు వచ్చింది.