యాప్నగరం

శాండ్ ఆర్ట్‌తో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

భారత్ జండా పండగకి సిద్ధమైంది. 71వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకి వేదికగా నిలిచే ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

TNN 14 Aug 2017, 11:05 pm
భారత్ జండా పండగకి సిద్ధమైంది. 71వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకి వేదికగా నిలిచే ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిషాలోని పూరి తీరంలో అందమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. త్రివర్ణ పతాకంతోపాటు శాంతికపోతాలు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలని తీసుకువస్తున్నట్టుగా వున్న సైకత శిల్పాన్ని రూపొందించి తన దేశ భక్తిని చాటుకోవడమేకాకుండా జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అనే సందేశాన్ని కూడా ఇచ్చారు.
Samayam Telugu sudarsan pattnaiks sand art on wishing independence day
శాండ్ ఆర్ట్‌తో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

71st Happy #IndependenceDay to all my countrymen. My SandArt, #JaiJawan ; #JaiKishan ; #JaiVigyan at Puri beach, Odisha. Jai Hind! 🇮🇳 pic.twitter.com/L2AWuauzSK— Sudarsan Pattnaik (@sudarsansand) August 14, 2017
అనేక సామాజిక అంశాలు, ఇతర రాజకీయ పరిణామాలపై తనదైన స్టైల్లో స్పందించే సుదర్శన్ పట్నాయక్ ఎప్పటికప్పుడు తన భావాలని తన సైకత శిల్పాలతో వ్యక్తపరుస్తుండటం తరచుగా చూస్తున్నదే. అలాగే రేపు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఒకరోజు ముందే పూరి తీరంలో సుదర్శన్ పట్నాయక్ శాంతి సందేశంతో రూపొందించిన ఈ సైకత శిల్పం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.