యాప్నగరం

మూఢనమ్మకంతో కొడుకును పోగొట్టుకున్న తండ్రి

ఆధునిక సాంకేతిక యుగంలోనూ మూఢ నమ్మకాలతో మనషులు విచక్షణ కోల్పోతున్నారు. ఎంతలా అంటే కడుపున పుట్టిన కొడుకునే కర్కశంగా చంపుకునేంతలా.

TNN 9 Feb 2017, 3:57 pm
ఆధునిక సాంకేతిక యుగంలోనూ మూఢ నమ్మకాలతో మనషులు విచక్షణ కోల్పోతున్నారు. ఎంతలా అంటే కడుపున పుట్టిన కొడుకునే కర్కశంగా చంపుకునేంతలా. వింత చేష్టలకు తన చెట్టంత కొడుకు నొప్పితో విలవిలలాడినా ఆ తండ్రి గుడ్డిగా ఓ స్వామీజీనే నమ్మాడు కానీ బిడ్డ పరిస్థితిని గమనించలేకపోయాడు. దీని ఫలితంగా అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
Samayam Telugu superstitious father kill his son in nellore in andhrapradesh
మూఢనమ్మకంతో కొడుకును పోగొట్టుకున్న తండ్రి


బీటెక్ పూర్తిచేసిన కొడుక్కి దెయ్యం పట్టిందంటూ ఓ తండ్రి స్వామీజీ చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి కన్నకొడుకును శాశ్వతంగా దూరం చేసుకున్న విషాధ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవలే బీటెక్ పూర్తి చేసిన అశోక్ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాడు. అశోక్ మతిస్థిమితంతో మాట్లాడుతుండటంతో తండ్రి శ్రీనివాసులు కొడుకు పరిస్థితి గురించి స్థానికంగా ఉండే ఓ స్వామీజీకి వివరించాడు.

దీనికి ఆ స్వామీజీ నీ కొడుక్కి దెయ్యం పట్టింది... అది వదలాలంటే అతని కాళ్లు, చేతులు కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కి కడుపుపై బలంగా తొక్కాలని సూచించాడు. స్వామిజీ చెప్పినట్లుగానే శ్రీనివాసులు చేయడంతో అశోక్ ఊపిరాడక ఘోరంగా విలపిస్తూ మృతి చెందాడు. దీంతో కంగారు పడిన శ్రీనివాసులు పోలీసులకి సమాచారం అందేలోపే స్థానికుల సాయంతో మృతదేహాన్ని ఖననం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.