హైదరాబాద్: నగరంలోని లంగర్హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద రీతిలో ఓ యువతి మృతదేహాన్ని సోమవారం పోలీసులు గుర్తించారు. ఐడీ కార్డు ఆధారంగా.. ఆమె పేరు కావ్య అని, మాదాపూర్లోని డీఎల్ఎఫ్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించారు. 25 ఏళ్ల వయసున్న కావ్య.. పీవీ నర్సింహరావు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 77 ర్యాంప్ దగ్గర రక్తపు మడుగులో కనిపించింది. ఆమె బ్యాగ్, చెప్పులు డెడ్ బాడీ ఉన్న ప్రదేశానికి 150 మీటర్ల దూరంలో పడి ఉన్నాయి.
ఆమె ఉదయం ఏడు గంటలకు ఆఫీసుకెళ్లాల్సి ఉండగా.. పీవీ ఎక్స్ప్రెస్ వే దగ్గరకు ఎందుకు వెళ్లిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. చెప్పులు, బ్యాగ్ ఆమెకు దూరంగా ఎందుకు పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ మార్చురీకి తరలించామని పోలీసులు తెలిపారు.
ఆమె ఉదయం ఏడు గంటలకు ఆఫీసుకెళ్లాల్సి ఉండగా.. పీవీ ఎక్స్ప్రెస్ వే దగ్గరకు ఎందుకు వెళ్లిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. చెప్పులు, బ్యాగ్ ఆమెకు దూరంగా ఎందుకు పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ మార్చురీకి తరలించామని పోలీసులు తెలిపారు.