యాప్నగరం

ప్రమాద బాధితులను ఆస్పత్రిలో చేర్పిస్తే నజరానా!!

ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను ప్రాణాపాయం నుంచి కాపాడటానికి ఢిల్లీ ప్రభుత్వం ఓ విన్నూత్న పథకాన్ని ప్రారంభించడానికి ముందుకొచ్చింది.

TNN 8 Jan 2017, 1:25 pm
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను ప్రాణాపాయం నుంచి కాపాడటానికి ఢిల్లీ ప్రభుత్వం ఓ విన్నూత్న పథకాన్ని ప్రారంభించడానికి ముందుకొచ్చింది.
Samayam Telugu take an accident victim to hospital and delhi government will reward you with rs 2000
ప్రమాద బాధితులను ఆస్పత్రిలో చేర్పిస్తే నజరానా!!

రోడ్డు మీద వెళుతుండా కళ్ల ముందే ఓ ప్రమాదం జరిగితే మనసులో అయ్యో పాపం అనిపించినా అక్కడికి చేరుకుని సాయం చేసేవాళ్లు మనదేశంలో అరుదు. ఈ ఘటన గురించి సమాచారం అందిస్తే పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగడమే కాకుండా పోలీసుల నుంచి కూడా వేధింపులు ఎదురవుతాయని భావిస్తారు.

సుమారు 80 శాతం మంది వీటికి భయపడే ప్రమాదాలపై స్పందించకుండా తమ మానాన తాము జారుకుంటారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను ఆస్పత్రిలో చేర్పించేవారికి రూ. 2 వేలను ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించింది. ప్రజల్లో సామాజిక సేవా దృక్పథాన్ని కలిగించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆప్ సర్కారు తెలిపింది.

అంతే కాకుండా రివార్డుతోపాటు సాయపడిన వ్యక్తికి ప్రభుత్వం తరఫున ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తామని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వెల్లడించారు. తమ నిర్ణయంతో ప్రజల్లో చైతన్యం వస్తుందని ఆశిస్తున్నామని ఆయన అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.