యాప్నగరం

క్లాస్‌రూంలోనే టీచర్‌పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు..

క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెబుతుండగానే ఉపాధ్యాయురాలిపై ఓ వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. టీచర్‌ మంటల్లో కాలిపోతూ కేకలేయడాన్ని కళ్లారా చూసిన విద్యార్థులు భయంతో వణికిపోయారు..

TNN 17 Aug 2017, 11:59 am
క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెబుతుండగానే ఉపాధ్యాయురాలిపై ఓ వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. టీచర్‌ మంటల్లో కాలిపోతూ కేకలేయడాన్ని కళ్లారా చూసిన విద్యార్థులు భయంతో వణికిపోయారు. కొంత మంది విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. విద్యార్థుల అరుపులు విని ఘటనా స్థలానికి పరుగెత్తుకొచ్చిన ఇతర టీచర్లు, స్థానికులు ఆ టీటర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన బెంగుళూరుకు 55 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది.
Samayam Telugu teacher set ablaze in front of students over failed business
క్లాస్‌రూంలోనే టీచర్‌పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు..


వ్యాపార లావాదేవీల్లో వచ్చిన తేడాల వల్ల టీచర్‌ సునంద(50)పై ఆమె బిజినెస్ పాట్నర్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. బుధవారం (ఆగస్టు 16) మధ్యాహ్నం 2 గంటల సమయంలో సునంద అయిదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రం పాఠాలు చెబుతుండగా.. క్లాస్‌రూంలోకి వచ్చిన ఓ వ్యక్తి ఆమెపై పెద్దగా అరిచాడు. ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.

సునంద అతణ్ని పాఠశాల నుంచి వెళ్లిపోవాలని గద్దించగా.. అతడు తన వెంట తెచ్చుకున్న డబ్బాను తెరిచి అకస్మాత్తుగా ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి పారిపోయాడు. ప్రస్తుతం ఆమె 50 శాతం కాలిన గాయాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రేణుకారాధ్యను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని వాళ్లు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.