యాప్నగరం

ప్రేమికుల చిహ్నం సాక్షిగా లవర్స్ సూసైడ్

ఓ ముస్లిం అబ్బాయి, హిందూ అమ్మాయి ప్రేమించుకున్నారు. టీనేజీలో ఉన్న వీరిద్దరూ.. తమను తల్లిదండ్రులు ఎక్కడ విడదీస్తారోనని భయపడ్డారు.

TNN 30 Sep 2016, 3:55 pm
 ఓ ముస్లిం అబ్బాయి, హిందూ అమ్మాయి ప్రేమించుకున్నారు. టీనేజీలో ఉన్న వీరిద్దరూ.. తమను తల్లిదండ్రులు ఎక్కడ విడదీస్తారోనని భయపడ్డారు. దీంతో ప్రేమికుల చిహ్నమైన తాజ్‌మహల్‌ను దర్శించిన వీరిద్దరూ ఆగ్రాలోనే రైలు కింద పడి ప్రాణాలు వదిలారు. వివరాల్లోకి వెళితే..
Samayam Telugu teens end lives in suicide pact fearing family opposition
ప్రేమికుల చిహ్నం సాక్షిగా లవర్స్ సూసైడ్

మహారాష్ట్రలోని సంగ్లీ సమీపంలోని హరోలీ గ్రామానికి చెందిన జకీర్ దిలావర్ (17), అయోధ్య పాటిల్(16) పన్నెండో తరగతి చదవుతున్నారు. గత కొంత కాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. అయోధ్య తండ్రి ఆ ప్రాంత శివసేన నాయకుడు. ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే మతాలు వేరైన కారణంగా పెద్దలు తమను విడదీస్తారని వారు భయపడ్డారు. దీంతో వారిద్దరూ సెప్టెంబర్ 23న ఇంట్లో నుంచి పారిపోయారు. తమ బిడ్డలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కవతే-మహంకాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ అమ్మాయి మొబైల్‌ను ట్రేస్ చేసిన పోలీసులు సిగ్నల్ ఆధారంగా వారు కళ్యాణ్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. వారికి చేరువయ్యేలోగానే ఆ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో ఆ టీనేజీ జంట జాడను గుర్తించలేకపోయారు. అక్కడి నుంచి ఆగ్రా వెళ్లిన ఆ లవర్స్.. ప్రేమ మందిరం తాజ్‌మహల్‌ను దర్శించుకొని అక్కడ ఫోటోలు తీసుకున్నారు. తర్వాత సూసైడ్ నోట్ రాసిపెట్టి శహద్రా సమీపంలో వేగంగా వెళ్తున్న రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై బుధవారం రాత్రి సమయంలో ఆగ్రా పోలీసులు కవతే-మహంకాల్ పోలీసులకు సమాచారం అందించారు. తమను పెద్దలు వేరు చేస్తారేమోననే భయంతో బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు వారు సూసైడ్ లెటర్లో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.