తెలుగు రాష్ట్రాలను చలి గజగజ వణికించేస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఉదయం పది గంటల వరకు పొగమంచు పరుచుకోవడంతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ఏరియాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. లంబసింగి ప్రాంతంలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా రాకపోకలకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక భాగ్యనగరంలో కూడా ఉదయం పూట ఉద్యోగాల షిఫ్టులకు వెళ్లేవారు పలు ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రా ఊటీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాలను చలి గజగజ వణికించేస్తోంది.
TNN 20 Dec 2016, 11:21 am