యాప్నగరం

స్త్రీని చూడకుండానే అతడు మరణించాడు

82 ఏళ్ల బతికిన ఓ పురుషుడు... తన జీవిత కాలంలో స్త్రీని చూడనే లేదు.

TNN 22 Feb 2017, 2:30 pm
ఇది ఒక వింత కథ. 82 ఏళ్లు బతికిన ఓ పురుషుడు... తన జీవిత కాలంలో స్త్రీని చూడనే లేదు. ఆమె ఎలా ఉంటుందో ఊహ కూడా తెలియదు. కనీసం తన తల్లిని కూడా చూడలేదు. ఈ ప్రపంచంలో ఇలా స్త్రీని చూడని పురుషుడు అతనొక్కడే అయ్యుండొచ్చు. చరిత్రకారులు చెప్పినదాని ప్రకారం అతని పేరు మైకెల్ టొలాటోస్. 1856లో గ్రీకు దేశంలో జన్మించాడు. అతను పుట్టిన నాలుగ్గంటలకే తల్లి కన్నుమూసింది. ఆ బిడ్డని తండ్రి, బంధవులు దగ్గరికి తీసుకోలేదు. బిడ్డని సన్యాసులు ఉండే మౌంట్ అతోస్ దగ్గర వదిలేశారు. ఆ సన్యాసులే బాబు ఏడుపు విని అతడిని చేరదీశారు. మైకెల్ టొలాటోస్ అని పేరు పెట్టి ఆలనా పాలనా చూశారు. తమలో ఒకరిగా కలుపుకున్నారు.
Samayam Telugu the story of the man who lived and died without ever seeing a woman
స్త్రీని చూడకుండానే అతడు మరణించాడు



మౌంట్ అతోస్ అనేది గ్రీసు లోని ఓ పర్వతం దానిపై కేవలం సన్యాసులు మాత్రమే నివసిస్తారు. వారు తమ శాశ్వత నివాసాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. వారి ప్రాంతంలోకి కేవలం పురుషులకే ప్రవేశం. మహిళలు రాకూడదు. స్త్రీల రాకను 1060 సంవత్సరంలోనే నిషేధించారు. అలాగే జంతువులు కూడా ఆ పర్వతం మీదకి అడుగుపెట్టకూడదు. మైకెల్ అక్కడి సన్యాసుల మధ్యే చదువుకున్నాడు. ఆ పర్వతం కిందకి దిగి ఎప్పుడు రాలేదు. కనుక అతనికి స్త్రీ రూపం తెలియలేదు. అలా 82 ఏళ్లు బతికాడు. 1983లో తన తుదిశ్వాస విడిచాడు.


ఇప్పటికీ కూడా మౌంట్ అతోస్ మీదకి కేవలం పురుష టూరిస్టులే అడుగుపెట్టాలి. స్త్రీలు వెళ్ల కూడదు. అంతేకాదు అక్కడ నివసించే సన్యాసులు గెడ్డం గీసుకోకూడదు, తగువులాడుకోవడం, కొట్టుకోవడం చేయకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా సన్యాసులు నివసించే భవనం గోడలు దాటి ఉండే బయటి ప్రపంచం గురించి అస్సలు అడగకూడదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.