యాప్నగరం

భారత్‌కు పోటీగా పాకిస్థాన్ మామిడి పండ్లు!

వేసవికాలం వచ్చిందంటే మనందరికీ మొదట గుర్తొచ్చే పండు మామిడి. ఈ పండ్లను అమితంగా ఇష్టపడేవారు వేసవి కోసం వేచిచూస్తుంటారంటే అతిశయోక్తి కాదు.

TNN 19 Apr 2017, 4:54 pm
వేసవికాలం వచ్చిందంటే మనందరికీ మొదట గుర్తొచ్చే పండు మామిడి. ఈ పండ్లను అమితంగా ఇష్టపడేవారు వేసవి కోసం వేచిచూస్తుంటారంటే అతిశయోక్తి కాదు. ఆల్ఫోన్సో దగ్గర నుంచి బంగినపల్లి వరకు.. తోతపురి నుంచి రసాల వరకు మన దేశంలో దొరకని మామిడి పండు లేదు. ప్రపంచంలో అత్యధికంగా మామిడిని ఉత్పత్తిని చేస్తున్న దేశం కూడా ఇండియానే. భారత్ నుంచి వివిధ దేశాలకు మామిడి పండ్లు ఎగుమతి అవుతుంటాయి. అయితే ప్రస్తుతం విదేశీ మార్కెట్లలో భారత్‌కు పాకిస్థాన్ గట్టి పోటీనిస్తుంది.
Samayam Telugu these pakistani mangoes more bigger than indian mangoes
భారత్‌కు పోటీగా పాకిస్థాన్ మామిడి పండ్లు!


భారత్‌లో దొరికే మామిడి పండ్ల కంటే అతిపెద్ద సైజులో పాకిస్థాన్ మామిడి పండ్లను సాగుచేస్తోంది. పంజాబ్, సింధ్ ప్రావిన్సులలో పండిస్తోన్న అన్వర్ రతోల్, బాదామి, చౌన్సా మామిడి రకాలకు యూరప్, మధ్య ఆసియా దేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఈ రకం మామిడి పండ్లు చాలా పెద్దగా ఉంటాయి. ఒక్కోటి చిన్న సైజు గుమ్మడి కాయలా ఉంటూ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. భారత్ విదేశాలకు ఎక్కువగా ఎగుమతి చేసే అల్ఫోన్సో ధర అధికంగా ఉండటంతో.. చాలా మార్కెట్లు పాకిస్థాన్ మామిడి పండ్లపై ఆసక్తి కనబరుస్తున్నాయట. పాకిస్థాన్‌ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న అతిపెద్ద మామిడి పండ్లను మీరు వీడియోలో చూడొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.