యాప్నగరం

మోదీకి 20 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాక్ మహిళ!

పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ గత 20 ఏళ్లకు పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాఖీ కడుతున్నారు.

TNN 7 Aug 2017, 9:47 am
పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ గత 20 ఏళ్లకు పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాఖీ కడుతున్నారు. కొన్నేళ్ల క్రితం గుజరాత్ వ్యక్తిని పెళ్లిచేసుకుని భారత్‌కు వచ్చేసిన పాక్ మహిళ ఖమర్ మొహ్సిన్ షేక్ గత 22 నుంచి 23 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నారు. ఈ ఏడాది కూడా పవిత్ర రక్షా బంధన్ రోజున మోదీకి రాఖీ కట్టడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన బిజీ షెడ్యూల్ మూలంగా వీలుపడలేదు. అయితే ఈ విషయాన్ని స్వయంగా మోదీనే రెండు రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేప్పారు. దీంతో షేక్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఏఎన్‌ఐతో షేక్ స్వయంగా పంచుకున్నారు.
Samayam Telugu this pakistani woman has been tying rakhi on pm modi for over 20 years
మోదీకి 20 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాక్ మహిళ!


‘నా పెళ్లి అనంతరం పాక్ నుంచి భారత్‌కు వచ్చేశాను. తరవాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరాను. ఆర్ఎస్ఎస్‌లో చేరిన తరవాత నేను మొదటిగా నరేంద్ర భాయ్‌కే రాఖీ కట్టాను. అప్పుడు ఆయన కార్యకర్తగా పనిచేస్తున్నారు. తన కృషి, పట్టుదలతో దేశ ప్రధాని అయ్యారు. ఈ ఏడాది మోదీ చాలా బిజీగా ఉన్నారు. బహుశా రాఖీ కట్టడం కుదరకపోవచ్చు. అయినా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నాకు రెండు రోజుల ముందే మోదీ ఫోన్ చేశారు’ అని ఎంతో ఆనందంగా షేక్ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.