యాప్నగరం

ఎలుక మాంసం కిలో రూ.200.. ఎక్కడో తెలుసా?

ఆ రాష్ట్రంలో ప్రజలు ఎలుక మాంసాన్ని లొట్టలేసుకుని మరీ ఆరగిస్తారు. ఇంతకీ అక్కడ ఎలుకలను ఎందుకు తింటారు?

Samayam Telugu 27 Dec 2018, 5:17 pm
నాన్‌వెజ్‌లో చికెన్, మటన్, చేపలకే గిరాకీ ఉంటుందని అనుకుంటే పొరపాటే. ఆ రాష్ట్రంలో ఎలుక మాంసానికి కూడా మాంచి గిరాకీ ఉంది. అందుకే అక్కడ కిలో ఎలుక మాంసం ఏకంగా రూ.200 పలుకుతోంది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో చికెన్, పంది మాంసానికి డిమాండు ఎక్కువగా ఉంటుంది.
Samayam Telugu rat_nibbles_patient_eye_1524909451


అయితే, అస్సాంలోని బక్సా జిల్లాలోని కుమారికటా గ్రామస్తులు మాత్రం ఎలుక మాంసానికే అధిక ప్రాధాన్యమిస్తారు. అది వారి సాంప్రదాయ ఆహారం కావడంతో ఆదివారం వచ్చిందంటే చాలు.. ప్రజలంతా ఎలుక మాంసం కోసం క్యూ కడతారు. బ్రాయిలర్ చికెన్‌తో సమానంగా ఎలుక మాంసం ధరలు ఉంటున్నాయంటే అక్కడ డిమాండు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

గువహతీకి సుమారు 90 కిమీల దూరంలో ఉన్న ఇండియా-భూటాన్ సరిహద్దుల్లోని గ్రామాల్లో ప్రతి ఆదివారం తాజా ఎలుక మాంసాన్ని విక్రయిస్తారు. వీటి కోసం అస్సాం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి తరలివస్తారు. ఎలుక మాంసానికి ఉన్న గిరాకీ వల్ల అక్కడి రైతులు రెండు చేతులా సంపాదిస్తున్నారు. వీరు ఎలుకలను ఎందుకు తింటారనడానికి ప్రత్యేక కారణమైతే ఏదీ లేదు. ఎన్నాళ్ల నుంచో సాంప్రదాయకంగా వస్తున్న వంటకంగా ఎలుకలను ఆరగిస్తున్నారు.

ఎలుకలు రాత్రి వేళల్లో కన్నాల నుంచి బయటకు వస్తాయి. దీంతో రైతులు రాత్రి వేళ్లల్లో కర్రలతో నిర్మించిన బోనులను వ్యవసాయ క్షేత్రాల్లో పెడతారు. బోనులో పడిన ఎలుకలను కొద్ది రోజులు పోషించి, ఆదివారం మార్కెట్లకు తరలిస్తారు. ఎలుకలను పట్టుకోవడం వల్ల ఆదాయమే కాకుండా తమ పంటలను రక్షించుకోగలుగుతున్నాం అని రైతులు చెబుతున్నారు. 10 కిలోల నుంచి 20 కిలోల ఎలుకలను మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నామని తెలిపారు. అబ్బ.. ఈ బిజినెస్ ఏదో బాగుందే అనుకుంటున్నారా? మన రాష్ట్రాల్లో కూడా ఎలుకలు తినేవారు ఉండాలి కదా!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.