యాప్నగరం

ప్రాణాలకు తెగించి గ్యాంగ్‌రేప్‌ను అడ్డుకున్న బాలిక!

ఓ మైనర్ బాలిక ప్రాణాలకు తెగించి సామూహిక అత్యాచారానికి ప్రయత్నించిన వారి నుంచి న తప్పించుకుంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటుచేసుకుంది.

TNN 12 Nov 2017, 2:05 pm
ఓ మైనర్ బాలిక ప్రాణాలకు తెగించి సామూహిక అత్యాచారానికి ప్రయత్నించిన వారి నుంచి న తప్పించుకుంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటుచేసుకుంది. నగరానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతోన్న బాలికపై ముగ్గురు యువకులు శనివారం రాత్రి దాడి చేసి అత్యాచారం చేసేందుకు యత్నించారు. ఏలూరులోని ఓ ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి బాలికను అదే ప్రాంతానికి చెందిన విజయ్‌ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. తనను ప్రేమించకపోతే యాసిడ్‌ పోసి చంపేస్తానంటూ మూడు రోజుల కిందట ఆ బాలికను బెదిరించాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి బాలిక తన ఇంటి సమీపంలోని ఓ దుకాణానికి వెళ్లి వస్తుండగా విజయ్‌, అతని స్నేహితులు కలసి ఆమెను అపహరించి, నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లారు.
Samayam Telugu three youth attack a minor girl and she was escaped
ప్రాణాలకు తెగించి గ్యాంగ్‌రేప్‌ను అడ్డుకున్న బాలిక!


నిందితుడు విజయ్‌ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించగా, మరో యువకుడు ఆమె మెడపై బ్లేడ్‌ పెట్టి అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక మెడపై స్వల్ప గాయమైంది. బాలిక ధైర్యం తెచ్చుకొని కేకలు వేయగా ముగ్గురు యువకులు కంగారు పడ్డారు. ఇదే అదనుగా భావించిన బాధితురాలు వారి నుంచి తప్పించుకుని సమీపంలోని అమ్మమ్మ ఇంటికి చేరుకుని విషయం చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఏలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఏలూరు టూటౌన్‌ ఎస్సై కె.రామారావు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.