యాప్నగరం

శ్మశానంలో పెళ్లి రోజు వేడుక.. ఎందుకంటే?

శ్మశానం పేరెత్తితేనే చాలా మంది ముఖంలో రంగులు మారతాయి. కానీ ఓ జంట మాత్రం చివరి మజిలీలోనే తమ పెళ్లి రోజును జరుపుకొంది.

Samayam Telugu 10 Jul 2018, 5:18 pm
శ్మశానం పేరెత్తగానే చాలా మంది భయంతో వణికిపోతారు. దెయ్యాలు, భూతాలు కళ్ల ముందు కదలాడి భయం బుర్రలోకి ప్రవేశిస్తుంది. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలే అని నిరూపించడం కోసం ఓ జంట శ్మశానంలో తమ పెళ్లి రోజును జరుపుకొంది. ఈ ఘటన కర్ణాటకలోని కలబుర్గి శివార్లలో చోటు చేసుకుంది. నందికూరుకు చెందిన అనిత, పవన్ కుమార్ వాలకేరి అనే దంపతులు తమ 18వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శ్మశానాన్ని శుభ్రం చేశారు.
Samayam Telugu marriage day


జడ్మీ వైస్ చైర్మన్ అయిన అనిత, సామాజిక కార్యకర్త అయిన ఆమె భర్తతో కలిసి శ్మశానంలో పిచ్చి మొక్కలను పీకేసి.. చెత్తాచెదారం తొలగించి.. మొక్కలు నాటారు. శ్మశానంలోనే బంధువులు, గ్రామస్థుల సమక్షంలో దండలు మార్చుకున్నారు. తర్వాతి రోజు సమీప గ్రామాల్లోని మహిళలకు మిషన్ కుట్టడంలో శిక్షణ ఇచ్చారు. 30 మందితో కలిసి రక్తదానం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.