యాప్నగరం

కొత్త టెక్నాలజీ: రైలొచ్చినప్పుడే వెలిగే లైట్లు

చాలా రైల్వే స్టేషన్లలో లైట్లన్నీ ఇరవై నాలుగ్గంటలూ వెలిగే ఉంటాయి.

TNN 13 Apr 2017, 10:25 am
చాలా రైల్వే స్టేషన్లలో లైట్లన్నీ ఇరవై నాలుగ్గంటలూ వెలిగే ఉంటాయి. దీని వల్ల చాలా విద్యుత్ వృధా అయిపోతుంది. కరెంటుని ఆదా చేసేందుకు వెస్ట్రర్న్ రైల్వేస్ వారు కొత్త టెక్నాలజీని అమలులోకి తెస్తున్నారు. రైలు వచ్చినప్పుడే లైట్లు వెలిగేలా, రైలు స్టేషన్ నుంచి వెళ్లిపోగానే ఆగేలా కొత్త సిస్టమ్ ను తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ కొత్త పద్దతిని మూడు రైల్వే స్టేషన్లలో పరీక్షించి చూశారు. అక్కడ విజయవంతం కావడంతో 2017 చివరికల్లా తమ పరిధిలోకి వచ్చే అన్ని రైల్వే స్టేషన్లలోనూ అమలు చేయాలని భావిస్తున్నారు. స్టేషన్ లోని లైట్లను... దగ్గర్లోని సిగ్నల్ వ్యవస్థలో అనుసంధానం చేస్తారు. రైలు రాకను, పోకను తెలిపే సిగ్నల్స్ ను బట్టి లైట్లు వెలగడం, ఆరడం చేస్తుంటాయి.
Samayam Telugu train gone lights off this is how wr is saving electricity
కొత్త టెక్నాలజీ: రైలొచ్చినప్పుడే వెలిగే లైట్లు


రైలు స్టేషన్ దగ్గరికి వస్తున్నప్పుడు లైట్లు ఒకేసారి ఆన్ అవుతాయి. వెళ్లిపోగానే 70శాతం లైట్లు బంద్ అవుతాయి. ప్రయాణికులు ఉంటారు కనుక మిగతా లైట్లు ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటాయి. ప్రస్తుతం ఈ కొత్త పద్దతిని గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్, సబర్మతి, మణినగర్ స్టేషన్లలో ఏర్పాటు చేశారు. అలాగే స్టేషన్లలో సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయడం, ఎల్ ఈడీ లైట్లను బిగించడం వంటివి చేస్తోంది రైల్వే శాఖ. ఎలాగైనా విద్యుత్ ను ఆదా చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. మన రైల్వే స్టేషన్లలో కూడా ఇలాంటి పద్దతులను పాటిస్తే బోలెడంత విద్యుత్ ఆదా అవ్వడం ఖాయం.

Read this story in Gujarathi

http://www.iamgujarat.com/news/ahmedabad-news/other/train-gone-light…ving-electricity-40465/

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.