యాప్నగరం

రైలు కింద పడ్డాడు.. ప్రాణాలతో తిరిగొచ్చాడు!

రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన సంఘటన ముంబైలో చోటుచేసుకుంది.

TNN 2 Feb 2017, 10:11 am
రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని విఖ్రోలి ప్రాంతానికి చెందిన దింకర్ సక్పాల్ అనే వ్యక్తి బుధవారం ఉదయం 11.30 నిమిషాలకు దగ్గర్లోని ఎంఎంటీఎస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. లోకల్ రైలు ప్లాట్‌ఫాం వద్దకు వస్తున్న సమయంలో ఒక్కసారి ట్రాక్‌పైకి దూకి పట్టాలపై పడుకున్నాడు. రైలు అతని పైనుంచి దూసుకెళ్లింది. ఒక్కసారిగా అక్కడున్నవారందకీ షాక్. అతినికేమైందని అందరూ పరుగులు తీసారు. కానీ ఆ వ్యక్తి ప్రాణాలతో భయటపడ్డాడు. పట్టాల మధ్యలో పడుకోవడం, లోకల్ రైలు కొంచెం ఎత్తుగా ఉండటంతో దింకర్ ప్రాణాలు నిలిచాయి.
Samayam Telugu train runs over man in mumbai he escapes unscathed
రైలు కింద పడ్డాడు.. ప్రాణాలతో తిరిగొచ్చాడు!


మొత్తానికి రంగంలోని దిగిన రైల్వే పోలీసులు అతన్ని బయటికి తీసుకొచ్చారు. అనారోగ్యం, ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో దింకర్ వెల్లడించాడు. అతినికి కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని నచ్చజెప్పారు. జేబులో చిల్లిగవ్వ లేకపోవడంతో పోలీసులే దగ్గరుండి ఇంటికి దిగబెట్టారు.

(వీడియో బాంద్రాన్యూస్.కామ్ సౌజన్యంతో..)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.