యాప్నగరం

కవల బాలికలపై తండ్రీకొడుకుల అత్యాచారం

కవల బాలికలను ఓ ఇద్దరు దుర్మర్గపు తండ్రీకొడుకులు అత్యాచారం చేసిన సంఘటన ఇది.

Samayam Telugu 4 Nov 2016, 10:32 am
కవల బాలికలను ఓ ఇద్దరు దుర్మర్గపు తండ్రీకొడుకులు అత్యాచారం చేసిన సంఘటన ఇది. బాలికల తండ్రి అనారోగ్యంతో మంచంపట్టడం, తల్లి కూలీనాలీ చేసుకుంటూ కుటుంభాన్ని పోషించుకోవడమే..పాపమైపోయింది.
Samayam Telugu twin girls raped by father and son
కవల బాలికలపై తండ్రీకొడుకుల అత్యాచారం


ఆ దయనీయ కుటుంబాన్ని ఆదుకుంటున్నట్లు నటించి ఇద్దరు పసి మొగ్గల జీవితాలతో ఆడుకున్నారు ఆ బద్మాష్ తండ్రీ కొడుకులు.

వివరాల్లోకి వెళ్తే.. బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం ఉత్తర్ ప్రదేశ్ నుంచి నిరుపేద దంపతులు తమ కవల పిల్లలతో హైదరాబాద్ శివారులోని కాటేదాన్ సమీపంలో ఉన్న మైలార్ దేవ్ పల్లిలో గుడిసె వేసుకొని అందులో నివసిస్తున్నారు.

పిల్లలు స్థానిక పాఠశాలకు వెళ్తుండగా...తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకునేవారు. ఈ మధ్య తండ్రి అనారోగ్యంపాలయ్యాడు. భర్త మంచంపట్టడంతో భార్యే కూలీనాలీ చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. వీరి ధీనస్థితిని గమనించిన పక్కనే నివాసముండే తండ్రీకొడుకులిద్దరు...ఆ కవల బాలికలపై కన్నేశారు.

కొంతకాలంగా ఇద్దరు బాలికలను తండ్రీకొడుకులిద్దరూ లైంగింకంగా దోపిడి చేస్తున్నారు. అప్పుడప్పుడు సహాయం పేరిట పిల్లల తల్లికి డబ్బులిచ్చేవారు. తమ పేదరికం డబ్బులిచ్చినవారిపై ఆ తల్లిని తిరగబడకుండా చేసింది.

ఇలా వెలుగులోకి..:
కొద్దిరోజులగా కవల బాలికలిద్దరు అనారోగ్యంపాలవుతున్నారు. శారీరకంగా బలహీనంగా మారారు. దీంతో అనుమానం వచ్చిన ఆ పిల్లలకు పాఠాలు స్కూలు టీచర్ అడిగితే...ఏం జరిగిందో అంతా చెప్పారు.

పాఠశాల సిబ్బంది రంగారెడ్డి జిల్లా బాలల పరిరక్షణ సమితికి సమాచారం అందించారు. ఆ సంఘం అధ్యక్షుడు దేవర్ధన్ ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలికలను స్టేట్ రెస్క్యూ హోం తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.