యాప్నగరం

ఘోరం: రెండేళ్ల పసివాడిపై వేధింపుల కేసు

రెండేళ్ల వయసు పిల్లాడు... అమ్మ పెడితే తినడం, ఆడుకోవడం తప్ప ఇంకేమీ తెలియదు.

TNN 22 Apr 2017, 7:40 am
రెండేళ్ల వయసు పిల్లాడు... అమ్మ పెడితే తినడం, ఆడుకోవడం తప్ప ఇంకేమీ తెలియదు. అలాంటి పసివాడిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది ఓ మహిళ. కనీసం పోలీసులు కూడా ఆలోచించకుండా ఆ పిల్లాడిని పోలీస్ స్టేషన్ పిలిచి భయపెట్టారు. దీంతో ఆ పసివాడు భయంతో వణుకులు నిద్ర కూడా పోలేకపోతున్నాడు. బీహార్లోని చంపారన్ జిల్లా బేలా బైజు గ్రామంలో జరిగింది ఈ ఘటన. తండ్రి మీద ఉన్న కోపంతో పిల్లాడిపై కేసుపెట్టినట్టు తెలుస్తోంది. తెలిసిన సమాచారం మేరకు ఇప్పుడు 35 ఏళ్ల మహిళ పోలీస్ట్ స్టేషన్లో రెండేళ్ల బాలుడు తనను లైంగికంగా వేధించాడని, తన బంగారు చైను లాక్కున్నాడని కేసు పెట్టింది. ఆ బాలుడు దళితుడు.
Samayam Telugu two year old boy booked for molestation in bihar
ఘోరం: రెండేళ్ల పసివాడిపై వేధింపుల కేసు


బాలుడి తండ్రిని నెల రోజుల క్రితం మహిళ భర్త కొట్టాడు. తలకి తీవ్రగాయాలతో అతను బతికి బయటపడ్డాడు. ఆ ఘటనలో మహిళ భర్త, అలాగే గ్రామ సర్పంచిపైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు పిల్లాడి తండ్రి. తన భర్తని కాపాడుకునేందుకు మహిళ పిల్లాడిపై ఇలా కేసుపెట్టింది. ఎస్సీ ఎస్టీ అట్రిసిటీ కేసును ఉపసంహరించుకోవాలని బాలుడి తండ్రిని బెదిరిస్తూ వస్తోంది. కాగా మార్చి 15న ఆమె కేసుపెట్టడంతో పోలీసులు పిల్లాడికి సమన్లు జారీ చేశారు. స్టేషన్ హాజరవ్వమన్నారు. అభం శుభం ఎరుగని చిన్నారిని స్టేషన్లో బాగా భయపెట్టారు. ఆ గొడవకి, పరిస్థితులకు పసిహృదయం తల్లడిల్లిపోయింది. భయంతో వణికిపోయింది. అప్పట్నించి ఇంట్లో ఉన్న భయపడిపోతూ సరిగా నిద్రపోవడం లేదు. ఈ విషయం తల్లిదండ్రులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.