యాప్నగరం

ఎద్దుకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు

చనిపోయిన తన ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించిన రైతు అందరితో శభాష్ అనిపించుకున్నాడు

TNN 28 Sep 2016, 8:41 pm
వ్యవసాయం ప్రధాన వృత్తిగా భాసిళ్లుతున్న మన దేశంలో పశువులకు మనిషికి గల అనుబంధం ఈనాటిది కాదు. పాలిచ్చే ఆవులు, గేదెలకు ఎంత ప్రాధాన్యత ఉందో, వ్యవసాయంలో రైతుకు సాయపడే ఎద్దులకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అవి చనిపోతే ఇంట్లోవారే దూరమయ్యారనే బాధతో తపించిపోతారు. ఉత్తరప్రదేశ్ లో ఇదే జరిగింది. ఆ రాష్ట్రంలోని గున్నార్ పంచాయితీ పరిథిలోని సిక్రోరా భూర్ గ్రామంలో ఉండే పప్పు యాదవ్ అనే రైతుకు రాము అనే ఎద్దు ఉండేది. కొద్ది నెలలుగా అది అనారోగ్యంతో బాధపడింది. ఎన్ని రకాల వైద్యం చేసినా ప్రయోజనం లేక అది ఇటీవలే చనిపోయింది. దాని మరణంతో పప్పూ యాదవ్ కుటుంబం తల్లడిల్లిపోయింది. కన్నబిడ్డే దూరమయ్యాడనేంతగా బాధపడింది.
Samayam Telugu up farmer performs last rites of ox follows hindu rituals and organises feast
ఎద్దుకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు

పన్నెండేళ్ల క్రితం పప్పూ యాదవ్ కుటుంబం కొనుగోలు చేసిన రెండు ఎద్దుల్లో రాము ఒకటి. ప్రతీ రోజు పప్పుూ యాదవ్ తో పాటే రాము అలుపెరగకుండా కనీసం పన్నెండు గంటలపాటు కష్టపడేది. రాము మరణంతో తన కుడిభుజమే పడిపోయినట్లు అనిపిస్తోందని పప్పూ యాదవ్ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. తన కుటుంబం ఎదుగుదలలో రాము పాత్ర కాదనలేనిదని ఈ సందర్బంగా పప్పూ చెప్పాడు. దానికి శాస్త్రోక్తంగా హిందూ మత ఆచారాల ప్రకారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి దాని పట్ల తన అభిమానాన్ని పప్పూ కుటుంబం చాటుకుంది. అంతేకాదు, పన్నెండో రోజున వెయ్యిమందికి దాని పేరు మీద భోజనాలు కూడా పెట్టారు. చనిపోయిన తన తండ్రికి నిర్వహించిన మాదిరిగానే రాముకు కూడా కర్మకాండలను నిర్వహించానని పప్పూ చెప్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.