యాప్నగరం

కామాంధులు చెరబట్టిన దేహాన్నే సూసైడ్ నోట్‌గా..

కామాంధులు చెరబట్టిన దేహాన్నే సూసైడ్ లెటర్‌గా మార్చుకున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

TNN 20 Mar 2018, 1:20 pm
దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జనాభాలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో రేప్ కేసులు ఎక్కువే. ఓ వైపు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటున్నా.. అమ్మాయిలపై ఆగడాలు మాత్రం ఆగడం లేదు. కన్పూర్‌ డెహత్‌లోని సికిందరా ప్రాంతంలో 20 ఏళ్ల బీఏ విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారం జరిపారు. అవమానంగా భావించిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
Samayam Telugu rape


సూసైడ్ చేసుకోవడానికి ముందు తన చావుకు కారణం వారిద్దరేనంటూ.. ఒళ్లంతా రాసుకొని మరీ ఆమె ప్రాణాలు విడిచింది. ‘‘నా చావుకు పక్క ఊళ్లో ఉండే సంజయ్, అతడి మరదలు రూబీతోపాటు వాళ్ల దగ్గర పనిచేసే సోనూ కారణం. వారిని ఉరితీయండి’’ అని తన ఒంటి మీద రాసుకుంది.

సూసైడ్ నోట్ ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.