యాప్నగరం

కానిస్టేబుల్‌ను మహిళ పోలీస్ హత్య చేసి అతడిని....

ఓ కానిస్టేబుల్‌ను తోటి మహిళ కానిస్టేబుల్ హత్య చేసి ఏమీ తెలియనట్లు అతడిని హాస్పిటల్‌కు తరలించింది. ఈ దారుణమైన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని సహారన్పూర్‌లో చోటు చేసుకుంది.

TNN 19 Apr 2017, 8:43 pm
ఓ కానిస్టేబుల్‌ను తోటి మహిళ కానిస్టేబుల్ హత్య చేసి ఏమీ తెలియనట్లు అతడిని హాస్పిటల్‌కు తరలించింది. ఈ దారుణమైన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని సహారన్పూర్‌లో చోటు చేసుకుంది. తన సహోద్యోగిని హత్య చేసిన మ‌హిళా కానిస్టేబుల్ తర్వాత అతడిని ఆసుప‌త్రిలో చేర్పించింది. అతడు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వైద్యులతో చెప్పి హాస్పిటల్‌లో చేర్పించింది. అయితే అప్పటికి మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఆ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించే సమయంలో గొంతు నులిమి చంపేసినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Samayam Telugu uttar pradesh police constable killed by woman colleague
కానిస్టేబుల్‌ను మహిళ పోలీస్ హత్య చేసి అతడిని....


హాస్పిటల్‌లో చేర్పించిన ఆ మహిళా కానిస్టేబుల్‌ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలడంతో ఆమెను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన కానిస్టేబుల్ లలిత్ కుమార్, నిందితురాలు స‌హార‌న్పూర్‌లోని చర్చ్ కాంపాండ్ ఏరియాలో పక్కపక్కనే నివాసం ఉండేవారని పోలీసులు తెలిపారు. ఈ క్ర‌మంలోనే లలిత్ కుమార్ హ‌త్య‌కు గుర‌య్యాడ‌ని తెలిపారు. ఈ హ‌త్య‌కు గ‌ల కార‌ణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలియజేశారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టడంతో హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చిందని స్పెషల్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ లవ్ కుమార్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.