యాప్నగరం

చెన్నైలో ఉపరాష్ట్రపతి వినాయక చవితి పూజ

దేశ వ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో వినాయక చవితి జరుపుకుంటున్నారు. వాడవాడలా గణనాథులు వెలిశారు.

TNN 25 Aug 2017, 4:06 pm
దేశ వ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో వినాయక చవితి జరుపుకుంటున్నారు. వాడవాడలా గణనాథులు వెలిశారు. ఈ ఏడాది మట్టి విగ్రహాలకు భక్తులు అధిక ప్రధాన్యత ఇస్తున్నారు. చాలా మంది ఇళ్లలో మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించారు. రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులు కూడా మట్టి విగ్రహాలనే వాడాలని ప్రచారం చేశారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉండగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెన్నైలో వినాయక చవితిని జరుపుకున్నారు. నగరంలోని తన కుమార్తె దీప ఇంట్లో గణనాథుడికి పూజలు చేశారు. వినాయక వ్రత కల్పం పట్టుకుని గణేశుడి మంత్రాలు, కథ చదివారు.
Samayam Telugu vice president venkaiah naidu celebrates vinayaka chaturthi in chennai
చెన్నైలో ఉపరాష్ట్రపతి వినాయక చవితి పూజ


మరోవైపు నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కూడా తమ ఇంట్లో వినాయక చవితిని జరుపుకున్నారు. భర్త, ఇద్దరు కుమారులతో కలసి చేసిన పూజ ఫొటోలను ఆమె ట్విట్టర్‌లో పెట్టారు. కవిత కూడా మట్టి గణనాథులనే ప్రతిష్ఠించారు.
it's hubby's turn to do the pooja on ganesh chaturthi ganpathi bappa moriya!!! pic.twitter.com/7lIBmsfJFF — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 25, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.