నవ్యాంధ్ర రాజధాని ప్రాంత నగరం విజయవాడకు విశిష్ట గుర్తింపు లభించింది. దేశంలోని అతికొద్ది బహిరంగ మల విసర్జన రహిత నగరాల సరసన విజయవాడ నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు నగర పాలక సంస్థ పలు కార్యక్రమాలను అమలుచేస్తోంది. వీటి వల్ల ఈ మధ్య కాలంలో నగరంలో పారిశుద్ధ్యం బాగా మెరుగైంది. నగరవీధులు పరిశుభ్రంగా కళకళలాడుతున్నాయి. కొద్ది కాలం క్రితం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం విజయవాడలో పర్యటించింది. నగరంలో పారిశుద్ధ్యం స్థాయులు చూసి సంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చింది.
స్వచ్ఛవాడగా బెజవాడ.. కేంద్రం అభినందనలు
నవ్యాంధ్ర రాజధాని ప్రాంత నగరం విజయవాడకు విశిష్ట గుర్తింపు లభించింది
TNN 28 Sep 2016, 11:05 pm