తెలంగాణలో సీఎం కేసీఆర్ నాలుగున్నరేళ్లపాలనలో జరిగిన సంక్షేమం గురించి ప్రముఖ గాయకుడు, నంది అవార్డ్ గ్రహీత, ఇండియన్ ఐడిల్ ఫేమ్ కారుణ్య పాడిన పాట సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ''పేదింటి పెళ్లిలో పచ్చని పందిరై వీడు.. ఆడ బిడ్డకు పసుపు కుంకుమైనాడు.. పురటి బిడ్డలకందె వరమయ్యినాడు.. ఆగమై పోతున్న అన్నదాతలకు నీరు, పెట్టుబడి అయినాడు..'' అంటూ కారుణ్య పాడిన ఈ పాటను గడ్డం వీరూ రచించారు. బందూక్ లక్ష్మణ్ దర్శకత్వం వహించగా, గౌతమ్ సంగీతం అందించారు.
Karunya KCR Song: కారుణ్య నోట కేసీఆర్ పాట.. దుమ్మురేపుతోంది
కారుణ్య పాడిన ఈ పాటను గడ్డం వీరూ రచించారు. బందూక్ లక్ష్మణ్ దర్శకత్వం వహించగా, గౌతమ్ సంగీతం అందించారు.
Samayam Telugu 1 Dec 2018, 3:12 pm