యాప్నగరం

ప్రశంసిస్తూనే.. తమిళ తంబీలకు వీరూ రిక్వెస్ట్

జల్లికట్టును నిషేధించడంపై తమిళనాడు ప్రజలు చేపట్టిన నిరసన పట్ల వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.

TNN 18 Jan 2017, 1:45 pm
జల్లికట్టు వివాదంలో తమిళ తంబీలకు మరో ప్రముఖుడి మద్దతు లభించింది. సుప్రీం కోర్టు ఈ క్రీడపై నిషేధం విధించగా.. ఇప్పటికే రజనీ కాంత్, మహ్మద్ కైఫ్ తదితరులు జల్లికట్టుకు అనుకూలంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వీరి బాటలోనే వీరూ నడిచాడు. జల్లికట్టు పేరు ఎత్తకుండానే సెహ్వాగ్ తమిళ ప్రజలు చేపట్టిన శాంతియుత నిరసనను ప్రశంసించాడు. ఇదే తరహాలో శాంతియుతంగానే మీ నిరసనను తెలియజేయండని ఎలాంటి హింసాకాండకు తావు ఇవ్వొద్దని ఈ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ తమిళ ప్రజలను కోరాడు. శాంతియుత నిరసన అందరికీ ఓ పాఠం అవుతుందని వీరూ ట్వీట్ చేశాడు.
Samayam Telugu virender sehwag resonse over tamilnadu people peaceful protest jallikattu
ప్రశంసిస్తూనే.. తమిళ తంబీలకు వీరూ రిక్వెస్ట్


Wonderful to see protest in a peaceful way in Tamil Nadu.Request to maintain peace in your passion.Peaceful protest will be a lesson for all — Virender Sehwag (@virendersehwag) January 18, 2017
వీరూ చేసిన ఈ ట్వీట్‌కు ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. సెహ్వాగ్ ట్వీట్ చేసిన నాలుగు గంటల్లోనే దాదాపు పది వేల మంది దాన్ని రీ ట్వీట్ చేశారు. ఏకంగా 17 వేల మంది దానికి లైక్ కొట్టారు. వారిలో ఎక్కువ మంది తమిళ తంబీలే అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. ట్విట్టర్ ద్వారా పంచ్‌లు పేలుస్తూ.. తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. ఆరు నెలల్లోనే రూ. 30 లక్షలు సంపాందించిన వీరూకు ఏ విషయంపై ఎలా స్పందించాలో బాగానే తెలుసు.

అశ్విన్ పేరు చెబితే భారత బౌలర్ అని, అబ్దుల్ కలాం పేరు చెబితే భారత రాష్ట్రపతి, ఏఆర్ రెహ్మాన్ పేరు చెబితే భారత సంగీత దర్శకుడు అని చెప్పే ఉత్తరాది వారు, ఇతర భారతీయులు.. జల్లికట్టు, మత్స్యకారుల సమస్యల గురించి ప్రస్తావిస్తే మాత్రం అవి తమిళ ప్రజల సమస్యలు అని పేర్కొంటారంటూ ఇటీవల కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కైఫ్, వీరూ లాంటి ఉత్తర భారత క్రికెటర్ల స్పందన వీరికి ఊరట కలిగించి ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.