యాప్నగరం

భార్య బాధితుల కోసం మూడు దేశాల్లో బుల్లెట్ యాత్ర!

భార్యను వేధించిన భర్తపై కఠిన చర్యలు తీసుకుంటారు... మరి భర్తను వేధించే భార్యలపై ఎందుకు చర్యలు తీసుకోరంటూ ఓ వ్యక్తి ప్రశ్నిస్తూ మూడు దేశాల యాత్ర చేపట్టాడు.

Samayam Telugu 16 Apr 2017, 10:56 am
భార్యను వేధించిన భర్తపై కఠిన చర్యలు తీసుకుంటారు... మరి భర్తను వేధించే భార్యలపై ఎందుకు చర్యలు తీసుకోరంటూ ఓ వ్యక్తి ప్రశ్నిస్తూ మూడు దేశాల యాత్ర చేపట్టాడు. భార్యా బాధితులను కాపాడి, సమాజంలో జీవించే హక్కును వారు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతూ విశాఖకు చెందిన అమీర్‌ షరీఫ్‌ మూడు దేశాల యాత్రకు శ్రీకారం చుట్టాడు. స్త్రీ పురుష వివక్షకు తావులేకుండా వేధింపులకు గురిచేసే జీవిత భాగస్వాములిద్దరికీ సెక్షన్‌ 498ఎ వర్తించేలా చట్టాల్లో మార్పు తీసుకురావాలని ఆయన కోరుతున్నాడు.
Samayam Telugu vizag man travelled for domestic violence against men
భార్య బాధితుల కోసం మూడు దేశాల్లో బుల్లెట్ యాత్ర!


దీనిపై జనవరి 24న విశాఖలో మొదలు పెట్టిన షరీఫ్ యాత్ర దేశంలోని 25 రాష్ట్రాలతోపాటు నేపాల్‌, భూటాన్‌లో సాగింది. ద్విచక్ర వాహనంపై 23,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఆయన మార్గ మధ్యలో బుల్లెట్‌ రైడర్స్‌ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో చర్చించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రచారం నిర్వహించినట్లు అమీర్‌షరీఫ్‌ వెల్లడించారు. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ త్వరలో యాత్రచేపట్టి దీనిపై ప్రచారాన్ని పూర్తిచేస్తానని ఆయన తెలిపారు.

ఐపీసీ సెక్షన్ 498 ఎ ప్రకారం భర్తను వేధించే భార్యపై కూడా చర్యలు తీసుకోవాలంటూ అమిర్ షరీఫ్ కోరుతున్నాడు. దీని ప్రకారం కేవలం పురుషులపైనే చర్యలు తీసుకోవడం తగదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.