ఉత్తరాదిలో ఎడతెగక కురుస్తున్న వర్షాల కారణంగా సంభవిస్తున్న వరదల్లో పదుల సంఖ్యలో పశువులు చిక్కుకుని కొట్టుకుపోయాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మంద్సార్ నగరంలో కొద్ది రోజులుగా ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో ఒక్కసారిగా ఆ నగరంపైకి మెరుపు వరద సంభవించింది. అకస్మాత్తుగా పెద్ద ఎత్తున నీరు ఉప్పెనలా ముంచెత్తుకుపడటంతో స్థానికులు నివ్వెరపోయారు. పడుతూ లేస్తూ ఎలాగో తప్పించుకున్నారు. కానీ, నోరులేని మూగ జీవాలు మాత్రం వరదలో చిక్కుకున్నాయి. పదుల సంఖ్యలో పశువులు మెరుపు వరదల్లో కొట్టుకుపోయాయి.
మెరుపు వరదల్లో పశువులు
ఉత్తరాదిలో ఎడతెగక కురుస్తున్న వర్షాల కారణంగా సంభవిస్తున్న వరదల్లో పదుల సంఖ్యలో పశువులు చిక్కుకుని కొట్టుకుపోయాయి.
Samayam Telugu 12 Jul 2016, 9:32 pm