యాప్నగరం

ట్రిపుల్ రైడింగ్ వద్దన్నందకు పోలీసుని చితక్కొట్టారు!

సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలకు అతిక్రమిస్తే.. పోలీసులు వాహనదారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం చూసాం.

TNN 22 Apr 2017, 12:04 pm
సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలకు అతిక్రమిస్తే.. పోలీసులు వాహనదారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం చూసాం. మరి అతిగా ప్రవర్తించే బైక్ రైడర్లు, ఆటోవాలాలపై పోలీసులు చేయి చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. స్కూటర్‌పై ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న అమ్మాయిలను అడ్డుకున్న పాపానికి వారి బంధువులు ఓ పోలీసు అధికారిని చితక్కొట్టారు. మధ్యప్రదేశ్‌లోని గుణ పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
Samayam Telugu watch youth thrash policeman for opposing triple riding
ట్రిపుల్ రైడింగ్ వద్దన్నందకు పోలీసుని చితక్కొట్టారు!


గుణ పట్టణంలో ముగ్గురు అమ్మాయిలు హెల్మెట్ లేకుండా స్కూటర్‌పై ప్రయాణం చేస్తున్నారు. వీరిని స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ట్రిపుల్ రైడింగ్ చేయడానికి వీళ్లేదని.. స్కూటర్ పక్కన పెట్టమని ఆదేశించారు. అమ్మాయిలతో పాటు వేరే బైక్‌పై వచ్చిన వారి బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగింది. సహనం కోల్పోయిన అమ్మాయిల బంధువులు అశుతోష్ తివారీ అనే పోలీసు అధికారిపై దాడికి దిగారు. కింద పడేసి ఇష్టమొచ్చినట్లు కాళ్లతో తన్నారు. మిగతా పోలీసులు దాడిని అడ్డుకున్నారు. అశుతోష్ తివారీకి స్వల్ప గాయాలు కావడంతో స్థానికి ఆసుపత్రికి పంపారు. దాడికి పాల్పిడిన రాహుల్, రఘువంశీని అదుపులోకి తీసుకున్నారు. వీరు స్థానిక బీజేపీ నేతకు సన్నిహితులుగా తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.