యాప్నగరం

సర్జికల్ స్ట్రైక్స్: కక్కలేక మింగలేక పాక్ సతమతం

పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ జరిపిన మెరుపుదాడుల (surgical strikes) విషయమై పాకిస్థాన్ కకావికలమైపోతోంది.

TNN 29 Sep 2016, 10:29 pm
 గురువారం నాడు భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాదుల శిబిరాలపై జరిపిన మెరుపుదాడుల (surgical strikes) విషయమై ప్రపంచానికి ఏం చెప్పుకోవాలో తెలియక ఆ దేశ నాయకత్వం కకావికలమైపోతోంది. ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని అంగీకరిస్తే.. ఉగ్రవాదానికి ఆ దేశం పాలిచ్చి పోషిస్తోందని ప్రపంచం ముందు తన నోటితో తానే ఒప్పుకున్నట్లు అవుతుంది. అందుకే ఆ దేశ ప్రధాని మన సైన్యం జరిపిన మెరుపుదాడుల గురించి తప్పుడు ప్రచారం ప్రారంభించారని విశ్లేషకులు అంటున్నారు. అసలు తమ గడ్డపై భారత్ మెరుపుదాడులకు దిగలేదని, అలా జరిగితే తమ సైన్యం చేతులు ముడుచుకు కూర్చోబోదని పాక్ ప్రభుత్వ వర్గాలు విషయాన్ని దాచిపెట్టేందుకు యత్నిస్తున్నాయి.
Samayam Telugu what does pak say about indian armys surgical strikes
సర్జికల్ స్ట్రైక్స్: కక్కలేక మింగలేక పాక్ సతమతం


ఇదిలా ఉండగా ఈ తరహా మెరుపుదాడులు చేయడంలో ప్రపంచంలో కొద్ది దేశాలకు మాత్రమే ప్రావీణ్యం ఉంది. ఆ కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటి. గతంలో మయన్మార్ తీవ్రవాదులపై కూడా మన వాళ్లు ఈ తరహా సర్జికల్ స్ట్రైక్స్ జరిపి, పనిని కళ్లు మూసి తెరిచేలోగా విజయవంతంగా ముగించి తిరిగి వచ్చేశారు. ఇప్పుడు పాక్ లో కూడా ఇదే పని చేశారు. ప్రపంచ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను అంతమొందించేందుకు కూడా అమెరికా దళాలు ఇదే విధానాన్ని అవలంబించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.