యాప్నగరం

ఆ ఒక్కరోజు వాట్సాప్‌లో 1400 కోట్ల మెసేజ్‌లు

వాట్సాప్.. ప్రస్తుతం ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో కామన్ యాప్. వాట్సాప్‌లేని స్మార్ట్‌ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదు.

TNN 7 Jan 2017, 4:20 pm
వాట్సాప్.. ప్రస్తుతం ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో కామన్ యాప్. వాట్సాప్‌లేని స్మార్ట్‌ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆకర్షించింది ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్. ఈ యాప్ వచ్చిన తరవాత నెట్‌వర్క్ ఆపరేటర్ ద్వారా ఎస్‌ఎంఎస్‌లు పంపడం దాదాపు మానేసారు మొబైల్ యూజర్లు. దీనికి పెద్ద ఉదాహరణ ఇటీవల వచ్చిన న్యూ ఇయర్ సంబరం. కొత్త సంవత్సరాన్ని మన జీవితాల్లోకి తీసుకొచ్చిన జనవరి 1న వాట్సాప్ ద్వారా భారత్‌లో 1400 కోట్ల మెసేజ్‌లు వెళ్లాయట.
Samayam Telugu whatsapp users in india sent 14 billion messages on new years eve
ఆ ఒక్కరోజు వాట్సాప్‌లో 1400 కోట్ల మెసేజ్‌లు


ఫేస్‌బుక్ సొంతం చేసుకున్న వాట్సాప్‌కు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భారత్‌లోనే అత్యధిక మంది యూజర్లు ఉన్నారు. అంతర్జాతీయంగా వాట్సాప్‌కు 1 బిలియన్ యూజర్లుండగా.. భారత్‌లో 160 మిలియన్ మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ వెల్లడించిన వివరాల ఆధారంగా ఒక్క డిసెంబర్ 31 అర్ధరాత్రి 14 బిలియన్ మెసేజ్‌లు వాట్సాప్ ద్వారా సెండ్ అయ్యాయి. ఇప్పటి వరకు భారత్‌లో ఇదే అత్యధికం.

పండగలు, న్యూ ఇయర్ లాంటి సందర్భాల్లో టెలీకాం ఆపరేటర్లు ఎస్‌ఎంఎస్‌లకు ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అదే సమయంలో వాట్సాప్ ఉచితంగా మెసేజింగ్‌ను అందిస్తోంది. దీంతో వాట్సాప్ వినియోగం అమాంతం పెరిగిపోయింది. గతేడాది దీపావళి సందర్భంగా నెలకొన్న 8 బిలియన్ మెసేజ్‌ల రికార్డును న్యూ ఇయర్ తుడిచిపెట్టేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.