యాప్నగరం

‘గాలి’ పెళ్లిన మరిపించిన కేరళ వివాహం

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశమంతా డబ్బు కొరతతో అల్లాడుతుంటే బడాబాబుల పెళ్లి వేడుకలు మాత్రం అంగరంగ వైభంగా జరుగుతున్నాయి.

TNN 5 Dec 2016, 3:48 pm
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశమంతా డబ్బు కొరతతో అల్లాడుతుంటే బడాబాబుల పెళ్లి వేడుకలు మాత్రం అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. భారీ వ్యయంతో జరిగిన మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె వివాహాన్ని మరువకముందే కేరళలో మరో ఆడంబర కల్యాణం జరిగింది. బార్, హోటల్స్ వ్యాపారి బిజు రమేశ్ తన కుమార్తె పెళ్లిని కేరళలో ఘనంగా జరిపించారు. రిసెప్షన్ వేదిక కోసం ఢిల్లీలోని అక్షర్‌ధామ్ ఆలయాన్ని పోలిన సెట్‌ను వేయించారు. ముఖద్వారంగా మైసూర్ ప్యాలెస్‌ను నిర్మించారు.
Samayam Telugu when akshardham came to kerala for hotelier function
‘గాలి’ పెళ్లిన మరిపించిన కేరళ వివాహం


బిజు రమేశ్ కుమార్తె మేఘా, సీనియర్ కాంగ్రెస్ నేత, కేరళ మాజీ రెవెన్యూ మంత్రి అదూర్ ప్రకాశ్ కుమారుడు అజయ్‌ క్రిష్ణన్‌కు స్థానిక ఆలయంలో ఆదివారం ఉదయం సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగింది. అయితే రిసెప్షన్ మాత్రం చాలా ఆడంబరంగా నిర్వహించారు. తిరువనంతపురం జిల్లాలోని వెన్పలవట్టం సమీపంలో నిర్వహించిన రిసెప్షన్‌కు ఎనిమిదెకరాల్లో వేదికను నిర్మించారు. ఈ రిసెప్షన్‌లో రాజకీయ నాయకులు, ఆధ్యాత్మిక గురువులు పాల్గొన్నారు. అయితే ప్రముఖ నేతలు, రాష్ట్ర మంత్రులు ఈ పెళ్లికి హాజరయ్యారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

కాగా, బిజు రమేశ్ కేరళ బార్ హోటల్ యజమానుల అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్రంలో బార్‌ లైసెన్స్‌ను పునరుద్ధరించడానికి ఆర్థిక మంత్రి కేఎం మణి తమను రూ.5 కోట్ల లంచమడిగారని బిజు రమేశ్‌ గతంలో ఆరోపించి వార్తల్లో నిలిచారు. అయితే రమేశ్ ప్రస్తుతం హోటళ్లు, ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలు, నిర్మాణరంగ వ్యాపారాలు నడిపిస్తున్నారు.

Clik here to read this story in Malayalam

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.