యాప్నగరం

పిండంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన యువతి

19 ఏళ్ల ఓ యువతి సంచిలో పిండంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తనపై ఓ యువకుడు రేప్ చేశాడని, తర్వాత బలవంతంగా అబార్షన్ చేయించాడని ఫిర్యాదు చేసింది.

Samayam Telugu 23 Jul 2018, 9:47 am
19 ఏళ్ల ఓ యువతి సంచిలో పిండంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తనపై ఓ యువకుడు రేప్ చేశాడని, తర్వాత బలవంతంగా అబార్షన్ చేయించాడని ఫిర్యాదు చేసింది. ఇందుకు కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహలో చోటు చేసుకుంది. ఆమెను రేప్ చేసి, అబార్షన్ చేయించింది 22 ఏళ్ల మనోజ్‌గా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశామని హసన్‌పూర్ కొత్వాలి ఎస్‌హెచ్‌వో దేవేంద్ర శర్మ తెలిపారు.
Samayam Telugu rape.


ఐదు నెలల క్రితం తన తలకు తుపాకీ గురిపెట్టి నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడని వాపోయింది. పిండాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం వెతుకులాట ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.